వాలంటీర్ల రాజకీయం
అధికారం కోసం వైకాపా అక్రమ మార్గాల్లో వెళ్తోంది.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్లనే అధికార వైకాపా ప్రభుత్వం అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది.
బలవంతపు రాజీనామాలు
ఏజెంట్లుగా నియమించాలని పన్నాగం
న్యూస్టుడే, కర్నూలు సచివాలయం
అధికారం కోసం వైకాపా అక్రమ మార్గాల్లో వెళ్తోంది.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్లనే అధికార వైకాపా ప్రభుత్వం అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల రోజున ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోనే ఓటర్లను హెచ్చరించి ఓట్లు దండుకునేందుకు వారి ద్వారా ఎత్తులు వేస్తోంది. వాలంటీర్లను వైకాపా తరఫున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని చూస్తోంది.
ముందస్తు వ్యూహం
వాలంటీర్లనే పోలింగ్ ఏజెంట్లుగా పెడితే వైకాపాకు ఓటేసేవారెవరో.. ప్రత్యర్థి పార్టీకి మీట నొక్కేదెవరో వాలంటీర్లు గుర్తిస్తారని సీఎం జగన్ భావిస్తున్నారు. ఓటర్లను బెదిరించి అయినా ఓట్లు వేయించుకునేలా నిర్ణయించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారిని గుర్తించి అక్కడే భయపెట్టి ఓటు వేయించుకునేలా పథకం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వాలంటీర్లతో రాజీనామా చేయించి పోలింగ్ బూత్ ఏజెంట్లుగా నియమించాలని పన్నాగం పన్నారు. వైకాపా కేడర్ కంటే సొంత సైన్యంపైనే జగన్ నమ్మకం ఉంచారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికీ 355 మంది వరకు
కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 11 మండలాల్లో కలిపి మొత్తం 264 మంది గ్రామ సచివాలయ వాలంటీర్లు తమ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. సదరు వాలంటీర్ల రాజీనామాలను ఆయా మండలాల ఎంపీడీవోలు ఆమోదించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నంద్యాల జిల్లాలో 9 మండలాల్లో మొత్తం 91 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో 355 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.
50 మంది విధుల నుంచి తొలగింపు
అధికార పార్టీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న యాభై మంది వాలంటీర్లపై వేటు పడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి కర్నూలు జిల్లాలో 27, నంద్యాల జిల్లాలో 23 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
పోలింగ్ ఏజెంట్లుగా పాల్గొనటం నేరమే
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 134(ఏ) ప్రకారం ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం పొందుతున్న గ్రామ, వార్డు వాలంటీర్లు ‘పబ్లిక్ సర్వెంట్’ కేటగిరీలోకి వస్తారు. వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్, పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనడం చట్ట ప్రకారం నేరం. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది.
వేతనాలిస్తాం.. ఉద్యోగం ఇస్తాం
మళ్లీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వైకాపా నాయకులు వాలంటీర్లను బుజ్జగిస్తున్నారు. 30 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయాలని.. ఎన్నికల పోలింగ్ రోజున ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకొని ప్రజలను నయానో, భయానో బెదిరింపులకు గురి చేసి ఓట్లేయించుకునేందుకు ఆడుతున్న జగన్నాటకమే తప్ప మరొకటి కాదని విపక్షాలు మండిపడుతున్నాయి. వాలంటీర్లుగా పనిచేసిన వారిని ఎన్నికల పోలింగ్ రోజున అధికార పార్టీ ఏజెంట్లుగా నియమించకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
బలవంతం చేస్తూ..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వందల మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు అనడం కంటే నియోజకవర్గ వైకాపా అభ్యర్థులు వాలంటీర్ల చేత రాజీనామాలు చేయిస్తున్నారు. ‘‘మళ్లీ మనమే అధికారంలోకి వచ్చేది. మళ్లీ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం.. ఈ మూడు నెలలకు వేతనాలు సైతం ఇస్తాం’’ అని చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లను ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అధికారులు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. అధికారులు తమను ఉద్యోగాల నుంచి తొలగించడమేంటీ.. మేమే రాజీనామా చేస్తాం అనేలా వాలంటీర్ల చేత వైకాపా అభ్యర్థులు బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు.
ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ల తొలగింపు
(ఆదోనిగ్రామీణం),న్యూస్టుడే: మండలం మండిగిరికి చెందిన విజయ్, బేతస్ట్రా అనే ఇద్దరు వాలంటీర్లు వైకాపా ప్రచారంలో పాల్గొనడంతో విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో విజయశేఖర్ శుక్రవారం తెలిపారు.
తుగ్గలి, న్యూస్టుడే : జి.ఎర్రగుడి గ్రామ సచివాలయం పరిధిలో 15 మంది, శభాష్పురం-5 మంది మొత్తం 20 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేసినట్లు ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి వాలంటీర్లు రాజీనామా పత్రాలు అందించినట్లు ఆమె పేర్కొన్నారు.
నారాయణపురం, గణేకల్(ఆదోని గ్రామీణం), న్యూస్టుడే: ఆదోని మండలం నారాయణపురం, గణేకల్ గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు ఎంపీడీవో విజయశేఖర్, ఈవోఆర్డీ నాగరాజు శుక్రవారం తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు వాలంటీర్లు ప్రకటించారు.
మంత్రాలయం గ్రామీణం (కౌతాళం), న్యూస్టుడే: కౌతాళం గ్రామానికి చెందిన 9 మంది, తోవి గ్రామానికి చెందిన ఇద్దరు వాలంటీర్లు రాజీనామా చేసి పత్రాలను శుక్రవారం ఎంపీడీవో రఘునాథ్ గుప్తకు అందించారు. వైకాపా నాయకులు వాలంటీర్లను ఎన్నికలో ఉపయోగించుకునేందుకు రాజీనామాలకు ఒప్పిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల