స్తంభించిన జల జీవనం
దేవనకొండ మండలంలో 44 గ్రామాలు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ కింద రూ.2 కోట్లు మంజూరు కాగా.. 20 గ్రామాలకు సంబంధించి టెండర్లకు ఆసక్తి చూపకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.
జగన్ పాలనలో పల్లెలకు దాహం
పారని పథకం
దేవనకొండ మండలంలో 44 గ్రామాలు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ కింద రూ.2 కోట్లు మంజూరు కాగా.. 20 గ్రామాలకు సంబంధించి టెండర్లకు ఆసక్తి చూపకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కె.వెంకటాపురం, మాదాపురం గ్రామాల్లో నీటిసమస్య తీవ్రంగా ఉండటంతో అధికారులు ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. బోర్లు వేయించినా నీటిచుక్క కానరాని పరిస్థితి నెలకొంది.
హొళగుంద మండల పరిధిలోని నెరణికి గ్రామంలో తాగునీట¨ సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సుమారు 650 కుటుంబాలు ఉన్నాయి. వారానికోసారి సరఫరా చేస్తున్నారు. మండలంలోని 26 గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం 33 చోట్ల జల్ జీవన్ పనులు చేపట్టాలని నాలుగు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు రాలేదని ఆర్డబ్ల్యూఎస్ జేెఈ రామ్లీలా తెలిపారు.
తాగునీటి సమస్య తీవ్రం
-ముత్యాలమ్మ, బల్లెకల్, ఆదోని మండలం
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: మా గ్రామానికి కుప్పగల్ తాగునీటి పథకం నుంచి నాలుగు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. గ్రామంలో బోరుకు మోటారు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నారు. పైపులైన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీటి సరఫరా సరిగా జరగడం లేదు. నిధులు మంజూరయ్యాయని చెబుతున్నారు కానీ ఇంతవరకు పక్రియ ప్రారంభం కాలేదు.
సొంతంగా కుళాయిల ఏర్పాటు
- మద్దిలేటి, కలుగొట్ల సర్పంచి
వెల్దుర్తి, న్యూస్టుడే: కలుగొట్లలో నిధులు లేవని వీధిలో ఒక వైపు ఉన్న ఇళ్లకు మాత్రమే కుళాయిలు ఏర్పాటు చేశారు. మరో వైపు వదిలేయడంతో.. గ్రామస్థులే సొంతంగా ఖర్చుచేసి కుళాయిలు వేసుకున్నారు. ప్రస్తుతం గ్రామానికి నీరు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. కొత్త బోరు ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేకపోయింది.
ఎలాంటి పనులు చేపట్టలేదు
- రమేశ్, మొలగవల్లి
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: గ్రామంలో ఎలాంటి పనులు చేపట్టలేదు. జల్జీవన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కులాయి ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తే ఎంతో బాగుండేది. గ్రామానికి ఈ పథకం కింద రూ.1.46 కోట్లు వచ్చాయి. పనులు చేసేందుకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు.
నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం
- చిరంజీవి, దేవనకొండ
దేవనకొండ, న్యూస్టుడే: మా గ్రామంలో 400 కుటుంబాలు, 1300 జనాభా ఉంది. శాశ్వత నీటి పరిష్కారం చూపాలి. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేస్తున్నా.. పూర్తిగా సరిపోవడం లేదు. తాగునీటికి ఇబ్బందులు పడతున్నాం. సరైన వానలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. నీటిపథకాలు పనిచేయడం లేదు. దీంతో పొలాలకు వెళ్తున్నాం. అసలే వేసవి ఇంకా అవస్థలు పడుతున్నాం.
ఏడాదిగా అవస్థలే..
- మల్లయ్య మాదిగ, దూదేకొండ
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: గ్రామంలో చేపట్టిన ఇంటింటికీ కుళాయి పథకం ఎస్సీ కాలనీకి ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. సుమారు ఏడాదిన్నరగా కాలనీ మొత్తం తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుతం వేసవిలో తాగునీటి ఎద్దడి మరింత దారుణంగా ఉంది. గ్రామంలో కొన్ని కాలనీలకు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నా.. ఎస్సీ కాలనీకి మాత్రం ఇంత వరకు పైపులైన్లు కానీ, కుళాయిలు కానీ వేయలేదు. ప్రతి ఇంటి వద్ద కుళాయిలు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేపట్టాలి.
ఫిర్యాదు చేసినా.. స్పందించలేదు
- వెంకటరాముడు, పైచింతలకొండ
తుగ్గలి, న్యూస్టుడే: పైచింతలకొండ గ్రామంలో 40 రోజులు కిందట పనులు చేపట్టారు. మా కాలనీలో పైపులైన్ వేసేందుకు కాలవ తవ్వారు. తెదేపా మద్దతుదారులమని పనులను అలాగే వదిలేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు కాలనీవాసులంతా కలిసి ఫిర్యాదు చేశాం. ఆ తరువాత కాలనీలో తాగునీటి పైపులైన్ వేశారంతే. ఆ తరువాత కుళాయిలు వేయలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదు. కేవలం తెదేపా మద్దతుదారులమనే కారణంగానే 30 గృహాలకు కుళాయిలు ఏర్పాటు చేయలేదు. దీంతో మాకాలనీవాసులు గతంలో ఉన్న పాత నీటి పథకం వద్ద నుంచి నీరు తెచ్చుకొంటున్నాం. వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్