logo

సామాన్యులు బతకాలంటే.. తెదేపా అధికారంలోకి రావాలి

సామాన్య ప్రజలు బతకాలంటే తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు.

Published : 13 Apr 2024 02:23 IST

ముగతి (నందవరం), న్యూస్‌టుడే: సామాన్య ప్రజలు బతకాలంటే తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని ముగతి గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు రక్షణ కరవైందని, వారికి రక్షణ కల్పించేందుకు తెదేపా కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బీసీలను అణగదొక్కి రోడ్డున పడేశారన్నారు. బటన్‌ నొక్కుతూనే పీకలు నొక్కుతున్నారని ఆరోపించారు. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మినహా ఒక్క రూపాయి వెచ్చించలేదన్నారు. వెనుకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి, పూర్తి స్థాయి సామాజిక న్యాయమే లక్ష్యంగా తెదేపా-జనసేన, భాజపా ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయన్నారు. అనంతరం కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అరాచక వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదామన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మిగిల్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. అరాచకవాది జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని