logo

తాగునీరివ్వని ఎమ్మెల్యే మనకెందుకు?

ప్రజలకు, రైతులకు సాగు, తాగునీరివ్వని ఎమ్మెల్యే మన మంత్రాలయం నియోజకవర్గానికి అవసరమా అని తెదేపా అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి అన్నారు.

Published : 13 Apr 2024 02:25 IST

కోసిగి, న్యూస్‌టుడే: ప్రజలకు, రైతులకు సాగు, తాగునీరివ్వని ఎమ్మెల్యే మన మంత్రాలయం నియోజకవర్గానికి అవసరమా అని తెదేపా అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, చింతలగేని నర్సారెడ్డి, మండల కన్వీనర్‌ జ్ఞానేశ్‌లతో కలిసి కోసిగి మండలం జుమ్మాలదిన్నె, గౌడగల్లు, వందగల్లు, నెలకోసిగి, దుద్ది గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తెదేపా మ్యానిఫెస్టో పత్రాలు పంపిణీ చేశారు. గౌడగల్లు గ్రామంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మూడేళ్ల క్రితం సుమారు రూ.9 లక్షలతో జల్‌జీవన్‌ పథకాన్ని ప్రారంభించినా ఇంటింటికి కుళాయి నీటిని అందించలేదన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపాను గెలిపించి వైకాపాను తరిమికొట్టాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని