రోప్వే నిర్మాణంతో భక్తులకు కొత్త అనుభూతి
మన్యంకొండపై రోప్వే నిర్మాణంతో భక్తులకు కొత్త అనుభూతి కలగనుందని రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్ పేర్కొన్నారు.
రోప్వే నిర్మించే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పర్యాటక శాఖ ఎండీ మనోహర్,
చిత్రంలో దేవస్థానం ఛైర్మన్ మధుసూదన్కుమార్
మహబూబ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే : మన్యంకొండపై రోప్వే నిర్మాణంతో భక్తులకు కొత్త అనుభూతి కలగనుందని రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ అలహరి మధుసూదన్ కుమార్తో కలిసి రోప్వే నిర్మాణం పనులు చేపట్టే ప్రదేశాలను పరిశీలించారు. టెండరు ప్రక్రియ ప్రగతిలో ఉందని, ఇది పూర్తికాగానే రోప్వే ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రోప్వే నిర్మాణంతో మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. అన్నదాన సత్రం సమీపంలో రూ.50 కోట్ల వ్యయంతో మూడంస్తుల భవనం నిర్మించబోయే ఖాళీ స్థలాన్ని కూడా పర్యటక శాఖ ఎండీ మనోహర్ పరిశీలించారు. భవనం మొదటి అంతస్తులో భక్తులు తలనీలాల సమర్పణకు అనువుగా నీటి సౌలభ్యంతో కల్యాణకట్ట ఏర్పాటు చేస్తామని, రెండో అంతస్తులో ఒకేసారి వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేసేలా సదుపాయాలు కల్పిస్తామని, మూడో అంతస్తులను రోప్వేలో కొండపైకి చేరుకునే భక్తుల కోసం నిర్మించి హనుమద్దాల మండపం వద్ద క్యూలైన్తో అనుసంధానం చేస్తామని వివరించారు. దేవస్థానం ఛైర్మన్ అలహరి మధుసూదన్కుమార్ మాట్లాడుతూ మన్యంకొండ త్వరలోనే ప్రముఖ దేవస్థానాల జాబితాలో చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?