అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది.
మరికల్: తీలేర్లోని ఓ తోటలో రాలిన మామిడి కాయలు
ధన్వాడ, న్యూస్టుడే : ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. ముఖ్యంగా కోయిల్సాగర్ ఆయకట్టు పరిధిలోని గోటూర్, కొండ్రోన్పల్లి గ్రామాల్లో వరి పంటకు అపారనష్టం వాటిల్లింది. పై రెండు గ్రామాల్లో 2,500 వరకు వరి సాగు చేయగా ఇప్పటి వరకు వెయ్యి ఎకరాల్లో కోత పూర్తయ్యింది. మిగిలిన వాటిని నేడో రేపో కోయాలనుకుంటున్న తరుణంలో అకాల వర్షం సుమారుగా 8వందల ఎకరాల పంటను దెబ్బతీసింది. కల్లాలు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో, రోడ్డు పక్కన, కాల్వ గట్టున ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీళ్లు నిలిచి ముద్దగా మారింది. నర్వ మండలంలో అక్కడక్కడ వర్షం కురిసింది. మండల ఇన్ఛార్జి వ్యవసాయాధికారి శివకుమార్, ఏఈవో రాజుతో కలిసి తడిసిన, దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులు ఆదుకోవాలని రైతులు, నాయకులు కోరారు.
నేలరాలిన మామిడి కాయలు
కిష్టాపూర్ రెవెన్యూ పరిధిలోని మణిపూర్ తండా శివారులో రైతు రూప్లానాయక్ రెండు ఎకరాల్లో మామిడితోట, ధన్వాడకు చెందిన టైలర్ శ్రీనివాస్గౌడ్ నాలుగు ఎకరాల్లో, ఇదే గ్రామానికి చెందిన మెకానిక్ భాను పరిస్థితి అలాగే ఉంది. కిష్టాపూర్, కొండాపూర్, హన్మన్పల్లి, చర్లపల్లి గ్రామాల్లోని తోటల్లోనూ మామిడి కాయలు రాలి అన్నదాతలకు నష్టం వాటిల్లింది.
అంధకారంలో గ్రామాలు
ధన్వాడ మండలంలోని గోటూర్, కొండాపూర్ విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈదురు గాలుల దెబ్బకు చెట్లు నేలకొరిగి విద్యుత్తు తీగలపై పడటంతో తెగిపోయి స్తంభాలు నేలమట్టమయ్యాయి. నియంత్రికలు సైతం పడిపోయాయి. గోటూర్తో పాటు కొండ్రోన్పల్లి, కిష్టాపూర్, మీదితండా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
మరికల్(ధన్వాడ), న్యూస్టుడే : మరికల్ మండలంలో అకాల వర్షానికి మామిడి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీలేర్ గ్రామానికి చెందిన వీరారెడ్డి తోటలో విరివిగా కాసిన కాయలన్ని నేలమట్టమయ్యాయి. పూసల్పాడు గ్రామానికి చెందిన రైతు బసిరెడ్డి నాలుగున్నర ఎకరాల్లో రూ. నాలుగు లక్షలు వెచ్చించి బొప్పాయి తోట సాగు చేయగా కొమ్మలు, చెట్లు నేలకొరిగి బొప్పాయి దెబ్బతింది. పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని రైతు వాపోయారు. ఈ విషయాన్ని పండ్లతోటల శాఖాధికారులతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు బసిరెడ్డి చెప్పారు. పూసల్పాడులో విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు పడిపోయి సరఫరా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్డీఎస్ కాల్వకు నీటి విడుదల
[ 27-07-2024]
అలంపూర్ నియోజకవర్గ రైతులకు జీవనాధారం అయిన ఆర్డీఎస్ కాలువ ద్వారా శనివారం దిగుకు నీటిని విడుదల చేశారు. -
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
[ 27-07-2024]
బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. -
పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్గల్ : పాన్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!