సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
22 నుంచి నల్లమల కొండల్లో ఉత్సవాలు
సలేశ్వర క్షేత్రంలో కొలువుదీరిన లింగమయ్య
అచ్చంపేట న్యూటౌన్, న్యూస్టుడే : ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్రాబాద్ అభయారణ్యంలోని ఎత్తైన కొండల నడుమ వెయ్యి అడుగుల లోయలో కొలువైన పురాతన సలేశ్వర క్షేత్ర దర్శనానికి భక్తులు పోటెత్తుతుంటారు. కృష్ణానది నుంచి జాలువారే జలపాతాల అలల మధ్య అటవీ జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపజేస్తాయి.
ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న సలేశ్వర లింగమయ్య దర్శన ఘట్టం 200 అడుగుల ఎత్తైన కొండల్లో రాళ్లపై నుంచి కొనసాగుతుంది. ఫర్హాబాద్ నుంచి పుల్లయపల్లి చెంచు పెంటల మీదుగా సుమారుగా 30 కిలోమీటర్లు వాహనాల్లో ప్రయాణం సాగించాలి. అక్కడ నుంచి కొండలు, రాళ్ల దారిలో 4 కిలోమీటర్లు నడిచి వెళ్తే క్షేత్రానికి చేరుకుంటారు. సలేశ్వర క్షేత్రానికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై జలధారలు పడుతుంటాయి. అనాదిగా ఈ ఆలయంలో చెంచు పెద్దలే పూజారులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఉత్సవాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు లక్షలాదిగా తరలి వస్తుంటారు.
భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎండలో అలసిన భక్తులకు అన్నదానం, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తారు. క్షేత్రానికి అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం (పాత)
ఆద్యంతం అటవీ మార్గంలోనే..
వాహనాల్లో వెళ్లే పర్యాటకులు హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఫర్హాబాద్ కూడలి వద్ద అటవీశాఖ అధికారుల అనుమతులతో అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపేసి రాళ్లు, ప్రమాదకరమైన లోయ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. నాగర్కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలోని అంబగిరి, లింగాల మండలంలోని భక్తులు అప్పాయిపల్లి మీదుగా 30 కిలో మీటర్లు చేరుకుంటే అక్కడ గుండంలో తాగునీటి వసతి ఉంటుంది. అక్కడ కొంత సమయం సేద తీరి మరో 20 కిలో మీటర్లు అడవి దారిలో నడక మార్గంలో వెళ్తే సలేశ్వరం క్షేత్రానికి చేరుకుంటారు.
మూడు రోజులు మాత్రమే అనుమతి..
సలేశ్వరం జాతర నేపథ్యంలో ఈ నెల 22 ఉదయం నుంచి 24 సాయంత్రం వరకు మూడు రోజులు మాత్రమే అడవిలోకి వాహనాలకు అనుమతులు ఉంటాయి. అడవిలో మంటలు ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్, మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధం. అడవిలోకి వెళ్లే భక్తులు, పర్యాటకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని గుర్తించుకోవాలి. రానున్న రోజుల్లో 9 నెలలపాటు ఆంక్షలతో కూడిన సలేశ్వర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం.
రోహిత్ గోపిడి, డీఎఫ్వో నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.