రెండో రోజు ఆరు నామినేషన్లు
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు.
ఈనాడు, మహబూబ్నగర్: పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. మొదటి, రెండు రోజులు కలుపుకొని మొత్తం 10 మంది అభ్యర్థులు 12 సెట్ల నామపత్రాలు సమర్పించారు. ఈ రెండు రోజుల్లో భాజపాకు చెందిన డీకే అరుణ, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థులైన వంశీచంద్రెడ్డి, మల్లు రవి, భారాస అభ్యర్థులైన మన్నె శ్రీనివాస్రెడ్డి, ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తమ నామపత్రాలను సమర్పించారు. వీరితో పాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు చేశారు.
వంశీచంద్రెడ్డి మినహా..: మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మినహా మిగతా అభ్యర్థులంతా శుక్రవారం సాదాసీదాగానే నామపత్రాలు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి తరపున శ్రీధర్రెడ్డి, అనచరులు రవీందర్రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఉమాశంకర్, సరోజనమ్మ, హరిందర్రెడ్డి నామపత్రాలు సమర్పించారు. నాగర్కర్నూల్లో శుక్రవారం భారాస అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు.
మహబూబ్నగర్లో స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్న హరిందర్రెడ్డి.. సరోజనమ్మ... ఉమాశంకర్.. భారాస అభ్యర్థి
మన్నె శ్రీనివాస్రెడ్డి తరపున నామపత్రాలు దాఖలు చేస్తున్న శ్రీధర్రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం