తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు.
వేసవిలో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు
మహబూబ్నగర్ : సిబ్బందిని పరీక్షిస్తున్న ఆర్టీసీ వైద్యుడు డా.మైనుద్దీన్
న్యూస్టుడే, మహబూబ్నగర్ పట్టణం : నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. 8 నుంచి 10 గంటల వరకు బస్సుల్లోనే ఉంటూ విధులు నిర్వహించే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పడే అవస్థలు ఇక చెప్పనక్కర లేదు. డ్రైవర్ గంటల తరబడి ఇంజిన్ వద్ద కూర్చొని వాహనాన్ని తోలడం, భారీగా ఉంటున్న ప్రయాణికుల మధ్యలో తిరుగుతూ కండక్టర్ పనిచేయటం చాలా కష్టం. వేసవిలో వారి పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం.
ఇంజిన్ వేడితో అవస్థలు.. : ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటోంది. వేసవితాపం భరిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఆర్టీసీ యాజమాన్యం డిపోల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు మజ్జిగ పంపిణీ చేస్తోంది. సిబ్బంది బస్టాండ్లలోని సత్యసాయి ట్రస్టు చలివేంద్రాల్లో తాగునీటిని తమ సీసాలు నింపుకొని వెళ్తున్నారు. తలకు టోపీ, టవళ్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఇంజిన్ వేడిని మాత్రం భరించక తప్పడం లేదు. డ్రైవర్లకు కూలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తే ఇంజిన్ వేడి, వడగాలుల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
సిబ్బందికి వైద్యపరీక్షలు : ఆర్టీసీ యాజమాన్యం 2022లో అన్ని స్థాయిల కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు 11 రకాల వైద్యపరమైన పరీక్షలు చేయించింది. గురువారం నుంచి రెండో విడత వైద్య పరీక్షలు ప్రారంభించారు. మహబూబ్నగర్ డిపోలో ఆర్టీసీ వైద్యుడి పర్యవేక్షణలో పరీక్షలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ), బీపీ, కళ్లు, హిమోగ్లోబిన్, సిరమ్ క్రియాటీన్, ఆర్బీఎస్, టోటల్ కొలస్ట్రాల్, ఈసీజీ తదితర పరీక్షలు చేస్తున్నారు. వీటిలో ఏవైనా తేడాలుంటే వెంటనే హైదరాబాద్లోని ఆర్టీసీ ఆస్పత్రికి లేదా కార్పొరేట్ ఆస్పత్రులకు పంపించి చికిత్సలు అందిస్తున్నారు. చిన్న సమస్యలైతే ఇక్కడే మందులు ఇస్తున్నారు.
మజ్జిగతో కాస్త ఉపశమనం : మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఎండతో చాలా చెమట వస్తోంది. గ్లూకోజ్ లెవల్ పడిపోకుండా పానీయాలు, నీరు ఎక్కువగా తాగుతున్నా. డిపోల్లో మధ్యాహ్నం మజ్జిగ ఇవ్వటం కొంత ఉపశమనం కలిగిస్తోంది.
వెంకటయ్య, డ్రైవర్
వడగాలులతో ఇబ్బందులు.. : ఎండ చాలా ఎక్కువగా ఉంటోంది. గంటల తరబడి డ్రైవింగ్ సీట్లో కూర్చొని బస్సు నడపటం వల్ల చెమట చాలా వస్తోంది. దగ్గర తాగునీరు ఉంచుకుని తరచూ తాగుతున్నా. వడగాలులు ఎక్కువగా ఉన్నప్పుడు వడదెబ్బకు గురవుతాం. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.
నర్సింహులు గౌడ్, డ్రైవర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్డీఎస్ కాల్వకు నీటి విడుదల
[ 27-07-2024]
అలంపూర్ నియోజకవర్గ రైతులకు జీవనాధారం అయిన ఆర్డీఎస్ కాలువ ద్వారా శనివారం దిగుకు నీటిని విడుదల చేశారు. -
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
[ 27-07-2024]
బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. -
పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్గల్ : పాన్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్