గొర్రెల పంపిణీ లేనట్టే
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు.
డీడీల సొమ్ము వెనక్కి ఇవ్వాలని అధికారుల నిర్ణయం
మహబూబ్నగర్ వ్యవసాయం, న్యూస్టుడే : గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గొర్రెల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా చోట్ల గొర్రెల పెంపకందారులు తమకు ప్రభుత్వం వెంటనే యూనిట్లు పంపిణీ చేయాలని లేదా తాము చెల్లించిన డీడీలు అయినా వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. చివరకు స్థానిక అధికారులపై గొర్రెల పెంపకందారుల సంఘాలు, నాయకులు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో అడిగిన వాళ్లందరి డీడీలు వెనక్కి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. భారాస ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గొర్రెల యూనిట్ల కోసం చాలా మంది దరఖాస్తు చేశారు. ఒక్కో యూనిట్ విలువ రూ.1.75 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారు వాటాగా రూ.43,750 చెల్లించాలి. మిగతా మొత్తం ప్రభుత్వం రాయితీ కింద భరించి గొర్రెలు రైతులకు ఇస్తుంది. ఒక్కో యూనిట్లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. మొదటి విడత కింద 2018లో ఉమ్మడి జిల్లాలో 67,198 యూనిట్లు పంపిణీ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 629 కోట్లు ఖర్చు చేసింది. 2019లో రెండో విడతగా 71,354 యూనిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. నిధుల కొరతతో ఈ పథకం ముందుకు సాగలేదు. దాదాపు 70వేల మంది గొర్రెల పెంపకందారులు ఒక్కొక్కరు రూ.43,750 చొప్పున ప్రభుత్వానికి డీడీ చెల్లించారు. దాదాపు నాలుగేళ్లవుతున్నా గొర్రెలు పంపిణీ చేయకపోవటంతో డీడీలు చెల్లించిన వాళ్లంతా ఆశలు వదులుకున్నారు. సంబంధిత అధికారులు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని వేచిచూశారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు ఈ పథకం అమలుపై విచారణ చేపట్టడంతో పలు అక్రమాలు బయటపడ్డాయి. ఈ పథకం ఇక కొనసాగే అవకాశాలు లేవని గ్రహించిన జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు డీడీల సొమ్ము వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. దరఖాస్తుతో బ్యాంకు ఖాతా నకలును జత చేసి ఇవ్వాలని కోరారు. మహబూబ్నగర్ పశు సంవర్ధక శాఖ అధికారి డా.మధుసుధన్గౌడ్ను ‘న్యూస్టుడే’ సంప్రదించగా వివరాలు సమర్పించిన వారికి గురువారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం