పారిశుద్ధ్య చర్యలేవీ?
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా..
వ్యాధుల నివారణకు ముందస్తు కార్యాచరణ అవసరం
నాగర్కర్నూల్ రాంనగర్ కాలనీలోని కాల్వలో కదలని మురుగు
కందనూలు, న్యూస్టుడే : జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. జిల్లాలోని పురపాలక శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. ఏటా ఆలస్యంగా పారిశుద్ధ్య పనులు ప్రారంభించడం వలన దోమల బెడద పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా పురపాలక సంఘాల కమిషనర్లు, పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు, ఇతర సిబ్బంది లోక్సభ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పట్టణాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మురుగుతో అవస్థలు.. : జిల్లాలోని కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట పురపాలక సంఘాలుగా కొనసాగుతున్నాయి. మొత్తం 86 వార్డులున్నాయి. పట్టణాల్లోని ప్రధాన వార్డుల్లో అధికారులు మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టినా శివారు కాలనీల్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ఇళ్ల సమీపంలోని ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వగా మారుతోంది. నాగర్కర్నూల్ పట్టణంలోని స్నేహపురి కాలనీలో, అంబేడ్కర్ విగ్రహం వద్ద నాలాలు ఉన్నాయి. పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది ఇప్పటి వరకు నాలాలను శుభ్రం చేయడం లేదు. అచ్చంపేట పట్టణంలోని బస్టాండ్ వద్ద, వలపట్ల, మారుతీనగర్లోని మురుగుకాల్వలు శుభ్రం చేయకపోవడం వలన పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. కల్వకుర్తి పట్టణంలో రాజానగర్, కల్యాణ్నగర్ కాలనీలోని మురుగు కాల్వల చుట్టూ వివిధ రకాల పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడం వలన ఏటా వర్షాకాలంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని పలు వార్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ఏటా వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలోని పురపాలక అధికారులు స్పందించి ముందస్తు నాలాలు, మురుగుకాల్వలు శుభ్రం చేసి దోమలను నివారించడానికి రసాయనాలతో పిచికారీ చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రణాళికలు సిద్ధం చేశాం.. : వర్షాకాలానికి సంబంధించి పట్టణంలో ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. కొన్ని రోజులుగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటం వలన పనులు చేపట్టలేదు. శనివారం పారిశుద్ధ్య సిబ్బందితో సమావేశం నిర్వహించి మురుగు కాల్వలు శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశాం.
శ్యాంసుందర్, పురపాలక సంఘం కమిషనర్, అచ్చంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్గల్ : పాన్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు