లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్,
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. పాపిరెడ్డి
జైలులో కూరలు పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, చిత్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, జైలు పర్యవేక్షకుడు వెంకటేశం
మహబూబ్నగర్ నేరవిభాగం, న్యూస్టుడే : వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ-పిట్టి, ట్రాఫిక్ చలాన్లు, భూతగదా, సివిల్ కేసులు ఎక్కువ మొత్తంలో పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా కోర్టులో బీమా కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్తో సమావేశం ఏర్పాటు చేశారు. మోటారు వాహనాల ప్రమాదాల కేసులను అధిక మొత్తంలో పరిష్కరించేలా చూడాలని, కక్షిదారులు వచ్చే నెలలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్కు వచ్చేలా చూడాలని వారికి సూచించారు.
జైలులో తనిఖీలు : మహబూబ్నగర్లోని కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిరతో కలిసి జైలులో ఖైదీలకు అందుతున్న వసతులపై ఆరాతీశారు. ఖైదీలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నివాస వసతి బ్యారక్, ఇతర అంశాలపై జైలు అధికారులను ఆరాతీశారు. జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షకులు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?