యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం.
పరారీలో మరో ఇద్దరు నిందితులు
వివరాలను వెల్లడిస్తున్న సీఐ గాంధీనాయక్, ఎస్సై విజయ్కుమార్
మహబూబ్నగర్ నేరవిభాగం, న్యూస్టుడే : మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం.. అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన శ్రీకాంత్(25) గత నెల 25న మహబూబ్నగర్ మండలం అల్లీపూర్ గ్రామంలో బంధువుల గృహప్రవేశానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా సమీప బండమీదిపల్లిలోని మల్లికార్జున మద్యం దుకాణం వద్దకు వచ్చి బీరు కావాలని కౌంటర్లో కూర్చున్న రవికుమార్రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత శ్రీకాంత్ అల్లీపూర్కు వెళ్లి వాగ్వాదం జరిగిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకుందామని వారంతా మద్యం దుకాణం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల గొడవ చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. శ్రీకాంత్పై వైన్స్ నిర్వాహకులు, వారి స్నేహితులు, సిబ్బంది మూకుమ్మడిగా కట్టె, చీపురు, చేతులు, కాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. జనం భారీగా పోగు కావటంతో శ్రీకాంత్ను వదిలేశారు. శ్రీకాంత్కు కడుపులో, ఇతర భాగాల్లో మూగ దెబ్బలు తగిలినా కుటుంబ సభ్యులు, పోలీసులకు చెప్పలేదు. నాలుగైదు రోజుల తర్వాత అతడికి కడుపునొప్పి రావటంతో పాటు విరేచనాలు, వాంతులు కాగా కుటుంబ సభ్యులు కొత్తకోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ ఆసుపత్రికి, తర్వాత హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నెల 14న చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతిచెందాడు. మద్యం దుకాణ నిర్వాహకులు చేసిన దాడి వల్లే తన కుమారుడు మృతిచెందాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ తల్లి వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా 10 మంది నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాంత్పై దాడి చేసిన వారిలో చింతలపల్లి రవికుమార్రెడ్డి, కోట్ల అరుణ్కుమార్రెడ్డి, దిర్శనం రాకేశ్, కోట్ల ప్రవీణ్కుమార్రెడ్డి, కోట్ల కృష్ణారెడ్డి, పికిలి వెంకటేశ్, జర్పాటి చెన్నమ్మ, గజగోని చంద్రప్రకాశ్ గౌడ్ శనివారం పోలీసులకు లొంగిపోగా రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న శివశంకర్, రఘుపతిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు పరిశీలించటంతో పాటు పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చేలా విచారణ చేయటం వల్లనే ఆలస్యమైందని, ఈ కేసుపైసామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్కుమార్, పోలీసులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
[ 27-07-2024]
బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. -
పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్గల్ : పాన్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత