రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పోలీసుల తనిఖీల్లో ఉమ్మడి జిల్లాలో పట్టుకున్నవి ఇవే
న్యూస్టుడే, మహబూబ్నగర్ నేరవిభాగం, కందనూలు
మహబూబ్నగర్ : న్యూటౌన్ కూడలి వద్ద వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 13 నుంచి రాత్రింబవళ్లు రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర సాయుధ దళాలు గస్తీ నిర్వహించాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేసిన తనిఖీల్లో రూ.8.40 కోట్ల నగదు, 33,831.93 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రూ.2.98 కోట్లు ఉంటుందని అంచనా.
- మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలోని 14 చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న నారాయణపేట జిల్లాలోని కృష్ణా, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్, దామరగిద్ద, మద్దూరు మండలాల్లో 9 చోట్ల, మహబూబ్నగర్ జిల్లాలో బాలానగర్, నంచర్ల, అడ్డాకుల, లాల్కోట, కొల్లూరు ప్రాంతాల్లో ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ నెల 10న రాత్రి గోవా నుంచి భారీ మద్యం లోడ్తో వస్తున్న లారీని బాలానగర్ తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనుమతి, ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.2.38 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 165 కేసులు నమోదు చేశారు. రూ.2,18,85,967 విలువైన 20,149.37 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో రాయికల్ టోల్ప్లాజా వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు.
- నాగర్కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని మద్యం, డబ్బుల ప్రభావాన్ని అరికట్టడానికి మూడు జిల్లాల పరిధిలో 19 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నందిన్నె, కేటీదొడ్డి, బల్గెర, రాజోలి, ర్యాలంపాడు, పుల్లూరు వద్ద, నాగర్కర్నూల్ జిల్లాలో బిజినేపల్లి మండలం మంగనూర్, ఊర్కొండ, మన్ననూర్, పెంట్లవెల్లి, అచ్చంపేట, వెల్దండ, వనపర్తి జిల్లాలో ఖిల్లాగణపురం, కొత్తకోట, పెబ్బేరు వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 383 నగదు పట్టివేత కేసులు నమోదు కాగా రూ.4.33 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.62.28 లక్షల విలువ చేసే 10,285 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్