logo

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర సందర్భంగా వడ్డేపల్లి పురపాలిక పరిధిలోని పైపాడ్ గ్రామంలో ఆదివారం కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి.

Published : 19 May 2024 16:21 IST

రాజోలి: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర సందర్భంగా వడ్డేపల్లి పురపాలిక పరిధిలోని పైపాడ్ గ్రామంలో ఆదివారం కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలు గ్రామ ఐక్యతగా నిలుస్తున్నాయన్నారు. మూడు రోజులపాటు ఈ పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోయ ఎల్లప్ప, బోయ తిమ్మప్ప, తిమ్మారెడ్డి, కొండలు, పింజర్ లాల్, బీచుపల్లి, వేణు, మాధన్న  తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని