పంట రుణాలపై సీఐడీ విచారణ
రైతులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అచ్చంపేట బ్రాంచి నుంచి 2017-2019 మధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు
రూ.10 కోట్ల మేర అక్రమాలు
వంకేశ్వరంలో రైతును విచారిస్తున్న సీఐడి ఇన్స్పెక్టర్
అమ్రాబాద్, న్యూస్టుడే : రైతులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అచ్చంపేట బ్రాంచి నుంచి 2017-2019 మధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ శంకర్నాయక్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు లక్ష్మణ్, సైదులు రెండు బృందాలుగా పదర మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు. శుక్రవారం మండలంలోని వంకేశ్వరంలో లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బృందం, సైదులు ఆధ్వర్యంలోని బృందం ఇప్పలపల్లిలో రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సీఐడీ-సీఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 1,827 మంది రైతులు డీసీసీబీ నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ఖాతాలను మదింపు (ఆడిట్) చేసే క్రమంలో చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు జిల్లా సహకారాధికారి పత్యానాయక్కు అనుమానం వచ్చింది. విచారణ కోసం అచ్చంపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసును పరిశీలించిన అధికారులు అక్రమాలు సుమారు రూ.10 కోట్లకు పైగా ఉండటంతో కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ మేరకు అధికారులు గ్రామాల్లో ఖాతాల వారీగా రైతులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు. జాబితాలను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. డీసీసీబీ నుంచి పంట రుణం తీసుకున్నది లేనిది, తీసుకుంటే ఎంత తీసుకున్నారు. తదితర వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను బ్యాంకులోని వివరాలతో పోల్చిచూడనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న 1,827 మంది రైతులను కలిసి వివరాలు సేకరిస్తామని తెలిపారు. విచారణానంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.
వంకేశ్వరం పంచాయతీ కార్యాలయంలో పంట రుణాలు తీసుకున్న వారి జాబితాను పరిశీలిస్తున్న రైతులు
రైతులు సహకరించాలి.. : డీసీసీబీలో జరిగిన అక్రమాలపై విచారణ నిమిత్తం వచ్చే అధికారులకు రైతులు సహకరించాలని సీఐడీ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కోరారు. దళారుల మాయమాటలకు తలొగ్గి కొందరు రైతులు వివరాలను సక్రమంగా వెల్లడించటం లేదని తెలిపారు. సరైన వివరాలు అందించని పక్షంలో రైతులే నష్టపోతారని చెప్పారు. వివరాలు సేకరించేందుకు వచ్చే అధికారుల గురించి ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్