అవగాహన.. అప్రమత్తత
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయానికి సిద్ధమయ్యేలా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది
నేటి నుంచి రైతు సదస్సులు
దుక్కి దున్నుతున్న మహిళా రైతు
కొత్తకోట, న్యూస్టుడే : ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయానికి సిద్ధమయ్యేలా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. నేల స్వభావం ఆధారంగా అన్నదాతలను సాగుకు సమాయత్తం చేసే దిశగా కదలాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావు వీడియో కాన్ఫరెన్సులో వ్యవసాయ అధికారులను సూచించారు. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా అప్రమత్తం చేస్తూ వెంటనే వారికి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారీగా ఉదయం 7.30 నుంచి 11.30 వరకు నిర్వహించే సదస్సుల్లో ఎక్కువ మంది రైతులు పాల్గొనేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజా ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించకుండా కార్యక్రమాలు కొనసాగించాలని 5వ తేదీ నుంచి వారిని భాగస్వాములను చేయవచ్చని సూచించింది.
భరోసా కల్పించేలా..: జూన్ రెండో వారంలోగా వర్షాలు కురిసి రైతులు తీరిక లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయని వెంటనే వారిని సాగుకు సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలతో వ్యవసాయ శాఖ అధికారులు ఆమేరకు ప్రణాళికలు రూపొందించారు. పత్తి విత్తనాలు, ఇతర వ్యాపార పంటల కోసం రైతులు సీల్డ్ విత్తనాలు కొనేలా అప్రమత్తం చేయాలని, పంట పూర్తయ్యే వరకు ఏ విత్తనం వాడారో గుర్తుండేలా విత్తనాల బస్తాను భద్రపరచేలా సూచనలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో సన్నాలు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టనుందని అధికారులు చెబుతున్నారు. ముందస్తు సమాచారంతో గ్రామాల్లో సమావేశమైన రైతులకు ఈ విషయాలను స్పష్టం చేయడమే కాకుండా విత్తనాల కోసం ముందుగానే టోకెన్లు ఇచ్చే పద్ధతిని అవలంభించేలా చర్యలు చేపడుతున్నారు.
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు..: రైతులను పీడిస్తున్న నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది. డీలర్లు విక్రయించే విత్తనాల వివరాలు, ఉత్పత్తిదారులు, కొనుగోలు చేస్తున్న రైతుల వివరాలు నమోదు చేయాలని సూచించింది. ప్రతి రోజూ వీరిపై పర్యవేక్షణ ఉండేలా ఏఈలు, ఏవోలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు డీలర్లపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ప్రభుత్వపరంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీతో అందజేసే విత్తనాలు పక్కదారి పట్టకుండా రైతులకు మాత్రమే అందుబాటులో ఉంచేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రైతు అవగాహన సదస్సులో వివరించాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం