logo

చికిత్స పొందుతూ సర్పంచి మృతి

చికిత్స పొందుతూ మండలంలోని చెదురుపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి వాల్యా నాయక్‌(60) మృతి చెందారు.

Published : 25 May 2024 12:47 IST

వెల్దండ: చికిత్స పొందుతూ మండలంలోని చెదురుపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి వాల్యా నాయక్‌(60) మృతి చెందారు. వెల్దండ మండలకేంద్రం సమీపంలో ఈ నెల 23న లారీ, కారు ఢీకొన్న ఘటనలో వాల్యానాయక్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వాల్యా నాయక్ చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని