చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి
అనారోగ్యంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఓ ఆటో డ్రైవర్ బుధవారం రాత్రి మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా..
వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని బాధితుల ఆందోళన
దౌలత్ (పాత చిత్రం), ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ కిశోర్తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల అర్బన్, న్యూస్టుడే : అనారోగ్యంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఓ ఆటో డ్రైవర్ బుధవారం రాత్రి మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. గుండె పోటుతో చనిపోయినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ కిశోర్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల పుర పరిధి మోమిన్ మహల్లా కాలనీకి చెందిన దౌలత్ (35) ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఈ నెల 21న అనారోగ్యంతో పాటు మల, మూత్ర సమస్యతో బాధపడుతూ గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారని, వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం ఆసుపత్రి వద్ద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పర్యవేక్షకులు డాక్టర్ కిశోర్తో పాటు వైద్య సేవలందిచిన వైద్యులతో మాట్లాడారు. రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పరిపాటిగా మారిందని, పని తీరుమార్చుకోవాలని హితవు పలికారు. ఆసుపత్రి పర్యవేక్షకులు మాట్లాడుతూ మల, మూత్రం రాక బాధపడుతున్న దౌలత్కు అన్ని రకాల పరీక్షలు చేశామని, సిటీ స్కాన్లో కూడా ఎలాంటి ప్రతికూల ఫలితం రాలేదని, బుధవారం రాత్రి గుండెపోటుకు గురికావడంతోనే మృతి చెందారని వివరించారు. వైద్య సేవల్లో డాక్టర్ నిర్లక్ష్యం లేదని తెలిపారు. బాధిత బంధువుల ఆరోపణలతో కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య సేవలందించిన డాక్టర్ భార్గవ వ్యాస్కు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా తాఖీదు ఇచ్చినట్టు కిశోర్ ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట