నేర్పిస్తూ.. సత్తా చాటుతూ!
వారంతా సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ హాయిగా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు.
అఖిల భారత సివిల్ సర్వీసెస్ పోటీల్లో పాలమూరు యువకులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ క్రీడలు
తెలంగాణ సివిల్ సర్వీసెస్ ఫుట్బాల్ జట్టులో జిల్లావాసులు
వారంతా సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ హాయిగా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ.. మరోపక్క మైదానంలో సాధన చేస్తూ తమ ఫిట్నెస్ కాపాడుకుంటున్నారు. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో జరుగుతున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఫుట్బాల్ టోర్నీలో పాల్గొన్న రాష్ట్ర జట్టులో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు చోటు సంపాదించారు. ఇప్పటికే గుజరాత్, తమిళనాడు జట్లపై విజయం సాధించి హుషారుగా ఉన్నారు. స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న క్రీడాకారులపై ‘న్యూస్టుడే’ కథనం.
తెలంగాణ జట్టుకు సారథిగా..
మహబూబ్నగర్కు చెందిన ఇమ్మాన్యుయేల్ జేమ్స్ వైద్యారోగ్య శాఖలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సాధన చేసి జాతీయ స్థాయి రూరల్ టోర్నీ, అండర్-17 ఎస్జీఎఫ్, అండర్-19 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 2001 నుంచి 2004 వరకు హైదరాబాద్లోని సాయ్లో శిక్షణ పొందారు. గతంలో గోవా, చెన్నై, త్రివేంద్రం, భూపాల్, దిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భువనేశ్వర్లో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్ర జట్టులో గోల్కీపర్గా సత్తా చాటుతున్నారు. ఫుట్బాల్ క్రీడకు ప్రోత్సాహం అవసరమని ఇమ్మాన్యుయేల్ జేమ్స్ అన్నారు.
ఫార్వర్డ్ క్రీడాకారుడిగా ప్రతిభ..
ఏనుగొండకు చెందిన రామకృష్ణ నస్రుల్లాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశలో అండర్-14 ఎస్జీఎఫ్, రెండు రాష్ట్రస్థాయి పోటీలు, డిగ్రీ చదివే రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తరఫున జాతీయ స్థాయిలో ఆడారు. 2015లో త్రివేంద్రం, 2019లో భోపాల్, 2023లో భువనేశ్వర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయి, సంతోష్ ట్రోఫీ పోటీలకు క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని రామకృష్ణ వివరించారు.
క్రీడాకారులకు సానబెడుతూ..
పాలమూరుకు చెందిన భానుకిరణ్ మునిమోక్షం జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశలో అండర్-21 జాతీయ స్థాయి, సబ్ జూనియర్స్, అంతర్ విశ్వవిద్యాలయాల జాతీయ స్థాయి టోర్నీల్లో ఓయూ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. జట్టులో మిడ్ ఫీల్డర్గా రాణిస్తున్న ఆయన నాలుగు జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఫుట్బాల్ టోర్నీల్లో పాల్గొన్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. వేపూర్కు చెందిన విద్యార్థి దినేశ్ ప్రతిష్ఠాత్మక సంతోష్ ట్రోఫీ టోర్నీకి ఎంపికయ్యాడు. ఫిట్నెస్ను కాపాడుకుంటూ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు భానుకిరణ్.
మూడో జాతీయ స్థాయి టోర్నీ..
జడ్చర్లకు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ బాదేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశలో ఫుట్బాల్, ఖోఖో, క్రికెట్, అథ్లెటిక్స్ క్రీడాకారుడిగా రాష్ట్రస్థాయి అండర్-16, అండర్-19, సబ్ జూనియర్స్ టోర్నీల్లో పాల్గొన్నారు. మూడు సివిల్ సర్వీసెస్ అఖిల భారత పోటీల్లో ఆడారు. 2008 నుంచి పీఈటీగా తన విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేశారు. వారంతా యూజీడీ కోర్సు చదువుతున్నారని, పీఈటీలుగా స్థిరపడేందుకు అవకాశం ఉందని చెప్పారు మొయిన్.
చిన్నారులను ప్రోత్సహించాలి
మహబూబ్నగర్కు చెందిన శశిధర్రెడ్డి వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. జట్టులో ఫార్వర్డ్ స్థానంలో రాణిస్తున్న ఆయన ఇప్పటివరకు భోపాల్, దిల్లీలో జరిగిన సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి టోర్నీలు ఆడారు. మూడో టోర్నీలో భువనేశ్వర్లో ఆడుతున్నారు. సెలవు రోజుల్లో మహబూబ్నగర్లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో సాధన చేస్తుంటారు. ‘చాలా మంది చిన్నారులు ఇతర క్రీడలు ఆడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఫుట్బాల్ వైపు ప్రోత్సహించా’లని శశిధర్రెడ్డి కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుద్దాం
[ 07-05-2024]
ఎన్నికల నేపథ్యంలో భాజపా, భారాస చెప్పే మాయమాటలు నమ్మొద్దని, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిద్దామని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
[ 07-05-2024]
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరేష్, పరశురాములు మృతి చెందారు. -
భాజపా, కాంగ్రెస్ పోటా పోటీగా ఎన్నికల ప్రచారం
[ 07-05-2024]
రాజోలి మండలంలోని గ్రామాల్లో మంగళవారం భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గ్రామాల్లో భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 07-05-2024]
మండలంలోని రాజోలి, మాన్ దొడ్డి గ్రామాల్లో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?
[ 07-05-2024]
పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. -
నిలిచిన ఈఎస్ఐ వైద్యసేవలు
[ 07-05-2024]
మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండలోని ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. -
మరో రెండు రోజులు కొనుగోళ్లు బంద్
[ 07-05-2024]
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్ యార్డు మొత్తం నిండిపోయింది. -
ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 07-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామి ఆరోపించారు. -
నల్లమలలో వన్యప్రాణులకు ఆపద
[ 07-05-2024]
సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. -
ఉల్లి రైతుకు కన్నీరు
[ 07-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. -
గెలిస్తే చాలు.. వసతులు వేలు
[ 07-05-2024]
ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.! -
అప్పుడు అవినీతిపరుడు.. ఇప్పుడు ఆదర్శప్రాయుడా?
[ 07-05-2024]
కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి
[ 07-05-2024]
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
గర్భంలోనే శిశువు మృతి
[ 07-05-2024]
నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. -
చెలమ నీరే దిక్కు
[ 07-05-2024]
మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది. -
అందరికీ పోస్టల్ బ్యాలెట్
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. -
భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు
[ 07-05-2024]
భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
[ 07-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
భారాస కనుమరుగు కావడం ఖాయం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. -
సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
[ 07-05-2024]
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. -
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం
[ 07-05-2024]
కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం