ఎవరి అంచనాలు వారివే
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల ప్రచారం నువ్వా..
నాగర్కర్నూల్, న్యూస్టుడే : నాగర్కర్నూల్ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల ప్రచారం నువ్వా.. నేనా అన్నట్లుగా సాగింది. నియోజకవర్గంలో తెలకపల్లి, తాడూరు, నాగర్కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఐదు మండలాల్లో భారాస అధిక్యత చూపింది. దాదాపు 54వేల మెజారిటీతో భారాస అభ్యర్థి గెలిచారు. ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. భారాసలో ఉన్న ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి కుమారుడు డా. కూచుకుళ్ల రాజేశ్రెడ్డి కాంగ్రెస్కు వెళ్లి టిక్కెట్టు తెచ్చుకొని రంగంలో నిలిచారు. కాంగ్రెస్లో ఉన్న నాగం జనార్దన్రెడ్డి భారాసలో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఏ మండలం ఎవరికి మెజారిటీ వస్తుందనే దానిపై వారం రోజులుగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎక్కడ నలుగురు గుమిగూడినా వీటిపైనే చర్చించుకుంటున్నారు. నాయకులు తమ ఇళ్ల వద్ద కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణతో విశ్లేషించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన రోజే అభ్యర్థులు తమ నాయకుల ద్వారా అంచనా సమాచారం తీసుకున్నారు. ఎగ్జిట్పోల్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఎవరికి ఎవరు తగ్గకుండా ఓట్లు రాబాట్టుకునేందుకు కృషి చేశారు. వలస ఓటర్లు ఎవరి వైపు నిలిచారు, ఎవరికి లాభం చేకూరుతుందనే అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు. పట్టణ ప్రజలు ఎవరి వైపు నిలిచారనేది ఆసక్తిగా మారింది.
హామీల ప్రభావం ఎంత?
భారాస అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి డా.రాజేశ్రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ హామీలు ఇస్తూ ప్రచారం చేశారు. మర్రి జనార్దన్రెడ్డి తాను గెలిస్తే ఇంజినీరింగ్ కళాశాల, ఐటీహబ్, పాలిటెక్నిక్ కళాశాల, మండల కేంద్రాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతానని హామీలు ఇస్తూ ప్రచారం చేశారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రాజేశ్రెడ్డి తాను గెలిస్తే కాంగ్రెస్ ఇచ్చే ఆరు గ్యారంటీలపై ఎక్కువగా ప్రచారం చేశారు. అధికార పార్టీ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారం చేశారు. ప్రజలు ఏ రకంగా తీర్పు ఇస్తారో ఒక్క రోజు వేచి చూడాల్సిందే. గ్రామస్థాయి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో నాయకులు పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్