వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె!
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది.
ఉమ్మడి జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు అవకాశం
గద్వాల న్యూటౌన్, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది. 1988 నుంచి ‘జవహర్లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన’(జేఎన్ఎన్ఎంఈఈ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి దాన్ని ‘రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని’(ఆర్బీవీపీ)గా పేరు
ఉమ్మడి జిల్లాలో..: 4,200కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో 5.50 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆర్బీవీపీలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. శాస్త్రీయ దృక్పథం, ఆసక్తి ఉడటం, సృజనాత్మకతకు పదును పెట్టడం, పరిసరాలు, ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ఖగోళ శాస్త్రం, గణితం తదితర అంశాలపై విద్యార్థులకు పట్టు ఉంటే.. వారు ఇందులో పాల్గొనవచ్చు. ఈ మేరకు ప్రధాన అంశం, ఉప అంశాలను ఎన్సీఈఆర్టీ ప్రకటించగా, వీటి ఆధారంగా విద్యార్థులను సన్నద్ధం చేసి, సెమినార్లో పాల్గొనేలా చేయాల్సి ఉంటుంది. గతేడాది నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో 8 మంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
సీనియర్, జూనియర్ విభాగాల్లో: జిల్లా స్థాయి ఆర్బీవీపీ కార్యక్రమం డిసెంబరు రెండో వారంలోగా పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రతి జిల్లాకు రూ.50 వేల నగదు జమైంది. డిసెంబరు చివరి వారంలో రాష్ట్ర స్థాయి ప్రదర్శన, జనవరిలో సౌత్ ఇండియా స్థాయి, ఫిబ్రవరి లేదా మార్చిలో జాతీయ స్థాయి ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఒక పాఠశాల నుంచి జూనియర్, సీనియర్ విభాగాల్లో విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు 10 శాతం ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది.
అంశాల ఆధారంగా..: ఒక ప్రధాన అంశం, దానికి అయిదు ఉప అంశాలుంటాయి. వీటి ఆధారంగా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ‘సమాజం కోసం వైజ్ఞానిక సాంకేతికత’ ప్రధానం అంశంగా ఉంటుంది. ఉప అంశాలుగా 1.ఆరోగ్యం, 2.పర్యావరణ జీవనశైలి, 3.వ్యవసాయం, 4.కమ్యూనికేషన్, రవాణా, 5.కంప్యూటేషనల్ థింకింగ్ ఉంటాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా పాఠశాలల హెచ్ఎంల వద్ద పేర్లు నమోదు చేయించుకొని, ప్రదర్శనకు సన్నద్ధం కావాలని గద్వాల జిల్లా సైన్సు అధికారి భాస్కర్ పాపన్న తెలిపారు. డీఈవో ఆదేశాలతో తేదీని ప్రకటిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్గల్ : పాన్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు