కనీస మద్దతుకు మించి ధరలు
రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం.
మహబూబ్నగర్ వ్యవసాయం, న్యూస్టుడే : రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం. జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ఏకంగా క్వింటాలుకు రూ.3,150 పలికింది. మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాలుకు రూ.2,970 ధర వచ్చింది. మహబూబ్నగర్ మార్కెట్కు 1,296, జడ్చర్ల మార్కెట్కు 13,680 క్వింటాళ్ల ధాన్యం వచ్చాయి. దేవరకద్రలో రూ.2,999 ధర వచ్చింది. చాలా మంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లకుండా వ్యవసాయ మార్కెట్లు, కర్ణాటకకు పంట తరలిస్తున్నారు. గడచిన వారం, పది రోజులుగా ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరో వారం, పది రోజుల్లో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రా, కర్ణాటక నుంచి వచ్చిన వ్యాపారులు పంట కొనుగోలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనూ కనీస మద్దతు ధరకు కొంటున్నా.. రైతులు అక్కడ అమ్మటం లేదు. ఇక సాధారణ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,183 కొనుగోలు చేస్తున్నారు.
అన్నదాతల్లో ఆనందం : ఎకరాలో వరి సాగు చేసిన ఒక్కో రైతుకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ఒక్కో రైతు రెండు, మూడు ఎకరాలను సాగు చేశారు. ఐదు నుంచి ఆరు ఎకరాలు వరి సాగు చేసిన ఒక్కో రైతుకు రూ.4లక్షల వరకు ఆదాయం వచ్చింది. వరి సాగు చేసిన చాలా మంది రైతులు రసాయన ఎరువులు చల్లకుండానే దిగుబడులు సాధించారు. వరి సాగు చేసిన రైతులంతా మెరుగైన ఆదాయం రావటంపై సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 6.81 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు.
విత్తనం దొరకట్లే.. : యాసంగిలో నీటి వసతి ఉన్న రైతులందరూ సోనా రకం వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోనా రకం విత్తనం కోసం రైతులంతా వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. 25 కిలోల విత్తన బస్తాను వ్యాపారులు రూ.1,250లకు అమ్ముతున్నారు. వానాకాలంలో ఇదే విత్తన బస్తా రూ.900లకు లభించింది. తెల్ల హంస రకం విత్తనం కూడా దొరకటం లేదు. తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థలోనూ ఈ రెండు రకాల విత్తనం దొరకటం లేదు. రైతులు మాత్రం దొడ్డు రకం విత్తనాలపై ఆసక్తి చూపటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్గల్ : పాన్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు