ఈసారీ నలుగురే!
శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సారి నలుగురు అభ్యర్థులు ఓట్ల లక్షాధికారులయ్యారు. 2018 ఎన్నికల్లోనూ నలుగురు అభ్యర్థులు ఈ ఫీట్ సాధించారు. కాకుంటే అప్పుడు సాధించిన వారు ఒక్కరూ ఈసారి ఎన్నికల్లో ఆ ఘనతను నిలుపుకోలేకపోయారు.
మారిన ఓట్ల లక్షాధికారులు
రాజోలి, న్యూస్టుడే: శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సారి నలుగురు అభ్యర్థులు ఓట్ల లక్షాధికారులయ్యారు. 2018 ఎన్నికల్లోనూ నలుగురు అభ్యర్థులు ఈ ఫీట్ సాధించారు. కాకుంటే అప్పుడు సాధించిన వారు ఒక్కరూ ఈసారి ఎన్నికల్లో ఆ ఘనతను నిలుపుకోలేకపోయారు.
నాడు: 2018 వనపర్తి: నియోజకవర్గంలో మొత్తం పోలైన 1.85 లక్షల ఓట్లలో నిరంజన్రెడ్డికి 1,11,956, సమీప ప్రత్యర్థి చిన్నారెడ్డికి 60,271 ఓట్లు పోలయ్యాయి. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 1.68 లక్షల ఓట్లలో మర్రి జనార్దన్రెడ్డికి 1,02,493 ఓట్లు, నాగం జనార్దన్రెడ్డికి 48,139 ఓట్లు వచ్చాయి. అలంపూర్లో 1.79 లక్షల ఓట్లు పోలుకాగా అబ్రహంకు 1,02,105 ఓట్లు, ప్రత్యర్థి సంపత్కుమార్కు 57,426 ఓట్లు లభించాయి. గద్వాలలో 1.90 లక్షల మంది ఓటు వేయగా, బండ్ల కృష్ణమోహన్రెడ్డికి 1,00,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి డీకే.అరుణకు 71,612 ఓట్లు పోలయ్యాయి.
నేడు: నాడు ఆ ఘనత సాధించిన వారిలో అబ్రహంకు ఈసారి పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు దూరమయ్యారు. నిరంజన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. గద్వాల నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాత్రమే విజయం సాధించారు. కానీ ఆయన ఈ సారి 94,097 ఓట్లతో లక్ష మార్కును చేరలేకపోయారు.
కొత్తగా నలుగురు: తాజా ఫలితాలలో కొడంగల్ నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి 1,06,558 ఓట్లు సాధించి గెలుపొందారు. వనపర్తి నియోజకవర్గంలో 2018 ఎన్నికలలో లక్షకు పైగా ఓట్లు భారాస పార్టీ అభ్యర్థి నిరంజన్రెడ్డి దక్కించుకోగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మేఘారెడ్డి 1,05,469 ఓట్లు సాధించారు. అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన చిక్కుడు వంశీకృష్ణ 1,15,337 ఓట్లు దక్కించుకున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో రెండో సారి కూడా ఓటర్లు భారాస పార్టీకే పెద్ద ఎత్తున మొగ్గు చూపారు. భారాస అభ్యర్థిగా బరిలో ఉన్న విజయుడికి 1,03,770 ఓట్లు వేసి గెలిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
[ 27-07-2024]
బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. -
పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్గల్ : పాన్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..