పనపర్తిలో వరుస విజయాలు ముగ్గురికే
చారిత్రక నేపథ్యమున్న వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. 1952లో మొదటి సారి జరిగిన ఎన్నికలో మొదటి ఎమ్మెల్యేగా గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి ఎన్నికయ్యారు.
వనపర్తి, న్యూస్టుడే : చారిత్రక నేపథ్యమున్న వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. 1952లో మొదటి సారి జరిగిన ఎన్నికలో మొదటి ఎమ్మెల్యేగా గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 17 ఎన్నికల్లో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే వరుసగా రెండోసారీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన వారిలో సంస్థానాధీశుల వంశస్థురాలు రాణికుముదినీదేవి 1962, 67లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు మీద పోటీ చేసి విజయం సాధించారు. తరువాత సినీనటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరిన వైద్యుడు బాలకృష్ణయ్య ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి 1983, 1985లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 1999, 2004లలో వరుసగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో పెద్దమందడి ఎంపీపీగా పనిచేసిన తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్థి మంత్రి నిరంజన్రెడ్డి మీద విజయం సాధించారు. మేఘారెడ్డి మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన వారిలో రావులచంద్రశేఖర్రెడ్డి(తెదేపా) కూడా ఉన్నారు. ఆయన 1994లో మొదటి సారి పోటీ చేసి చిన్నారెడ్డిమీద విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు