కమ్ముకున్న మేఘాలు!
మిగ్జాం తుపానుతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజులుగా ఈదురు గాలులు.. కొద్దిపాటి జల్లులు పడటం, ఆకాశం మేఘాలతో కమ్ముకోవటంతో వరి సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
హన్వాడలోని రైతు సేవా సహకార సంఘం ముందు ధాన్యంపై కవర్లు కప్పి ఉంచిన రైతులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ వ్యవసాయం : మిగ్జాం తుపానుతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజులుగా ఈదురు గాలులు.. కొద్దిపాటి జల్లులు పడటం, ఆకాశం మేఘాలతో కమ్ముకోవటంతో వరి సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పంట కోసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోశారు. అక్కడ కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల్లో నింపి కవర్లు కప్పారు. కొన్నచోట్ల ధాన్యం బస్తాలను వెంట వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు. కొందరు రైతులు పొలాల్లోనే ధాన్యాన్ని నిల్వ చేశారు. వ్యవసాయ మార్కెట్లకు తెచ్చిన రైతులు షెడ్ల కింద ఉంచుకున్నారు. మార్కెట్లలో వ్యాపారులు మంగళవారం కూడా రోజూలాగే పంట కొనుగోలు చేశారు. తుపాను భయం నేపథ్యంలో మార్కెట్లకు ఊహంచినంతగా పంట మాత్రం రాలేదు. మార్కెట్లలో రైతులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. వర్షాలు పడితే ఇబ్బందిగా ఉంటుందని, యంత్రాలు పొలాల్లోకి రాలేని పరిస్థితి ఉంటుందని కొందరు రైతులు వరికోతలు ఆపేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఎక్కడా వర్షాలు పడినట్లు సమాచారం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులను అప్రమత్తం చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులను కలిసి ధాన్యం కుప్పలపై కవర్లు కప్పి ఉంచాలని సూచిస్తున్నారు. వరికోతలు వద్దని చెబుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు కూడా కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. గాలి, వానలకు చెట్లు, వాటి కొమ్మలు తీగలపై పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కింది స్థాయి సిబ్బందికి సూచిస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది.. ప్రజలు విద్యుత్తు స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేశ్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ రైతులు రెండు, మూడు రోజుల వరకు కోతల్ని ఆపాలని సూచించారు. కోసిన ధాన్యాన్ని షెడ్లలో దాచుకోవాలంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!