పంచాయతీ భవనాలు పూర్తయ్యేనా?
గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం జనవరి నాటికి ముగుస్తుంది. కేవలం 55 రోజులు మాత్రమే ఉంది. పంచాయతీ భవనాల నిర్మాణం అప్పటిలోపు పూర్తయ్యేలా లేవు.
మరికల్: పెద్దచింతకుంటలో అసంపూర్తిగా పంచాయతీ భవనం
ధన్వాడ, న్యూస్టుడే : గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం జనవరి నాటికి ముగుస్తుంది. కేవలం 55 రోజులు మాత్రమే ఉంది. పంచాయతీ భవనాల నిర్మాణం అప్పటిలోపు పూర్తయ్యేలా లేవు. కొన్ని గ్రామాల్లో అసంపూర్తిగా పనులు ఉండగా మరికొన్ని గ్రామాల్లో అసలు ప్రారంభమే కాలేదు. చేసిన పనులకు నిధులు విడుదల కాలేదు. ప్రభుత్వం మారడంతో సర్పంచుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాకు 137 భవనాలు మంజూరు
జిల్లాలో 280 గ్రామ పంచాయతీలుండగా 2021-22లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 137 పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రతి భవనానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.27.40 కోట్లను మంజూరు చేశారు. మార్చిలోగానే వీటి నిర్మాణాలు పూర్తి చేయాలి. కానీ సీసీరోడ్లు, పంచాయతీ భవనాలు ఒకేసారి మంజూరు కావడంతో రోడ్లను ముందుగా పూర్తి చేశారు. తర్వాత పంచాయతీ భవనాల నిర్మాణం ప్రారంభం కాగా ఇప్పటి వరకు పది శాతంలోపే పూర్తయ్యాయి. చాలా చోట్ల అసంపూర్తిగానే దర్శనమిస్తుండగా కొన్ని చోట్ల ప్రారంభం కాలేదు. ధన్వాడలోని కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఏప్రిల్ నెలలో శిలాఫలకాలు ఆవిష్కరించారు. కిష్టాపూర్లో స్థల వివాదం, రాంకిష్టాయపల్లిలో ఆసక్తి చూపకపోవడంతో నేటికి పనులు మొదలు కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
ధన్వాడ: కిష్టాపూర్లో భూవివాదంతో శిలాఫలకానికే పరిమితమైన పనులు
బిల్లులు రాకపోవడంతో..
నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి సకాలంలో బిల్లులు రాకపోవడమూ ఒక కారణమని సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధన్వాడ మండలంలోని గోటూర్ గ్రామంలో మూడు నెలల కిందటే భవనాన్ని ప్రారంభించినా ఇంతవరకూ బిల్లులు రాలేదు. సొంత నిధులతో పనులు పూర్తి చేసిన సర్పంచులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏమ్నోన్పల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు బిల్లు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో నిర్మాణాలను పూర్తి చేసేందుకు సర్పంచులు ఆసక్తి చూపడంలేదు.
పూర్తి చేస్తాం : ఎన్నికల నేపథ్యంలో నిర్మాణాలు ఆగిపోయాయి. పనులు జరిగిన మేరకు బిల్లులు రూపొందించి పై అధికారులకు పంపించాము. త్వరలో విడుదలవుతాయి. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేస్తాం.
నరేందర్ పీˆఆర్ ఈఈ, నారాయణపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం