దొరికిన నగదు రూ.3.95 కోట్లు
అక్టోబర్ 9న హన్వాడ ప్రాంతానికి ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మహబూబ్నగర్ పట్టణం పాత బస్టాండు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద లభించిన రూ.6లక్షల నగదుకు ధ్రువపత్రాలు చూపకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యూస్టుడే, మహబూబ్నగర్ నేరవిభాగం
జిల్లా కేంద్రంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
అక్టోబర్ 9న హన్వాడ ప్రాంతానికి ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మహబూబ్నగర్ పట్టణం పాత బస్టాండు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద లభించిన రూ.6లక్షల నగదుకు ధ్రువపత్రాలు చూపకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
నవంబర్ 29న జిల్లా కేంద్రంలోని రైతుబజారు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఒకరి వద్ద రూ. 1.40 లక్షలు లభ్యం కాగా ధ్రువపత్రాలు చూపలేదు. నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంచడానికి నగదు తీసుకెళ్తున్నట్లు అనుమానించి కేసు నమోదు చేశారు.
జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎన్నికల వేళ పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగదు, ఆభరణాలు, వస్తువులు, చీరలు, మద్యం పట్టుకున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంతో 171 కేసులు నమోదు చేశారు. పోలీసులు, ఎన్నికల అధికారులు, ఎఫ్ఎస్టీ (ప్లయింగ్ స్వ్కాడ్ టీమ్), ఎస్ఎస్టీ (స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్), ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్), వీఎస్టీ (వీడియో సర్వేలెన్స్ టీమ్) తదితర బృందాలు నెలన్నర పాటు విస్తృతంగా తనిఖీలు చేశాయి. మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రకటన వచ్చిన నుంచి ముగిసే వరకు ఆధారాలు లేకుండా పట్టుబడిన రూ.3.95కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదు వివరాలు నమోదు చేసుకొని స్క్రూటినీ అధికారులకు అప్పగించారు. పెద్ద, చిన్న వ్యాపారులు, వివిధ అత్యవసరాలకు నగదు తీసుకెళ్తున్న వారు ఆధారాలు సమర్పించటంతో స్క్రూటినీ అధికారులు రూ.3.59 కోట్లు తిరిగి ఇచ్చేశారు. మరో రూ.28లక్షలు ఓ వస్త్ర దుకాణానికి సంబంధించిన సొమ్ము కావడంతో ఐటీ అధికారులకు అప్పగించారు. డబ్బుకు సంబంధించి రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.
1.39 లక్షల లీటర్ల మద్యం.. : జిల్లాలో అనుమతి లేకుండా సరఫరా చేస్తున్న మద్యాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న 9,120 లీటర్ల మద్యం విలువ రూ.44లక్షలుగా నిర్ధారించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు 1,30,270 లీటర్ల మద్యాన్ని పట్టుకోగా, దాని విలువ రూ.3.90 కోట్లుగా నిర్ధారించారు. వీటికి సంబంధించి పోలీసులు 165 కేసులు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 14 కేసులను నమోదు చేశారు. ఎన్నికల వేళ నెలన్నర పాటు తమ సిబ్బంది బాగా పనిచేశారని డీఎస్పీ మహేశ్ ‘న్యూస్టుడే’కు వివరించారు. రెండు కేసుల్లో మాత్రమే తమకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్నారు. అలాంటి వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
బంగారం 99, వెండి 302 తులాలు : జిల్లాలో జరిపిన తనిఖీల్లో 29 తులాల బంగారం, 302 తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 200 గ్రాముల వెండి మినహా మిగతా బంగారు, వెండి వస్తువులను తిరిగి ఇచ్చేశారు. ఇందుకు సంబంధించి 4 కేసులు నమోదు చేశారు. 150 చీరలు, 200 టీషర్టులు, గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్