మార్కండేయతో మహర్దశ
బిజినేపల్లి మండలం శాయిన్పల్లి వద్ద రూ. 77 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మార్కండేయ ఎత్తిపోతల పనులు పూర్తవగా, నవంబర్ 18న నీటిపారుదల శాఖ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.
5 గ్రామాలు, 17 గిరిజన తండాలకు సాగు నీరు
బిజినేపల్లి, న్యూస్టుడే
మార్కండేయ ఎత్తిపోతల ట్రయల్రన్ నిర్వహిస్తున్న అధికారులు
బిజినేపల్లి మండలం శాయిన్పల్లి వద్ద రూ. 77 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మార్కండేయ ఎత్తిపోతల పనులు పూర్తవగా, నవంబర్ 18న నీటిపారుదల శాఖ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. డిసెంబర్ నాటికి మార్కండేయ ఎత్తిపోతల ద్వారా 5 గ్రామాలు, 17 గిరిజన తండాల రైతులకు కృష్ణా జలాలు అందిస్తామని తెలిపిన అధికారులు ఆ దిశగా పనులు శరవేగంగా పూర్తి చేశారు. దీంతో సుమారు 7వేల ఎకరాలకు సాగు నీరు అందనుందని, నీటిపారుదల శాఖ డీఈ వరప్రసాద్ తెలిపారు. మార్కండేయ ట్రయల్రన్ విజయవంతం కావడంతో గంగారం, శాయిన్పల్లి, మమ్మాయిపల్లి, లట్టుపల్లి, పోలేపల్లి, 17 గిరిజన తండాల రైతుల సాగు నీటి కష్టాలు పూర్తిగా తీరునున్నాయి.
నీటిని విడుదల ప్రారంభం: మండలంలోని 35 గ్రామలు, 21 గిరిజన తండాలకు గానూ ప్రసుత్తం కేఎల్ఐ కాలువల ద్వారా 30 గ్రామాలు, 4 గిరిజన తండాలకు సాగు నీరందుతోంది. మిగిలిన గ్రామాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా శాయిన్పల్లిలోని మిరగలవాని చెరువు వద్ద మార్కండేయ ఎత్తిపోతల నిర్మాణానికి 2022లో శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరందిస్తామని అధికారులు పేర్కొన్నారు. అందుకు అవసరమైన రూ.77 కోట్లను విడుదల చేసి, పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. నవంబర్ నాటికి పనులు పూర్తి చేసిన అధికారులు, 18న ట్రయల్రన్ ఏర్పాటు చేయగా విజయవంతమైంది. దీంతో మొదట కాలువల ద్వారా శాయిన్పల్లి వద్ద ఉన్న ఎర్రకుంట, గంగారంలోని చిన్నకుంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని గ్రామాలకు కాలువల ద్వారా నీరు అందుతాయని అధికారులు తెలిపారు.
సాగు నీరు విడుదల చేస్తున్నాం..
మార్కండేయ నిర్మాణం పూర్తి చేసి ట్రయల్రన్ విజయవంతమైంది. ఇప్పటికే శాయిన్పల్లి, గంగారంలోని కుంటలకు సాగు నీటిని విడుదల చేస్తున్నాం. డిసెంబర్ చివరి నాటిని అన్ని గ్రామాలకు నీరందిస్తాం.
వరప్రసాద్, డీఈ, నీటిపారుదల శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం