ప్రయోగ కిట్ల జాడేది.?
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ పాఠాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వాటిని ప్రయోగ పరికరాలతో బోధించడం, విద్యార్థులతో చేయించడం ప్రధానం. తద్వారా పాఠశాల నుంచే భావిభారత శాస్త్రవేత్తలుగా వారిని రూపుదిద్దడానికి అవకాశం ఉంటుంది.
తరగతి గదిగా ఉపయోగిస్తున్న రాజోలి మండలం మాన్దొడ్డిలోని ప్రయోగశాల
గద్వాల న్యూటౌన్, న్యూస్టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ పాఠాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వాటిని ప్రయోగ పరికరాలతో బోధించడం, విద్యార్థులతో చేయించడం ప్రధానం. తద్వారా పాఠశాల నుంచే భావిభారత శాస్త్రవేత్తలుగా వారిని రూపుదిద్దడానికి అవకాశం ఉంటుంది. అయితే.. ఇందుకు ప్రధానంగా ఉపకరించే సైన్సు కిట్లు రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఫలితంగా విద్యార్థులు ప్రయోగ పాఠాలకు నోచుకోవడం లేదు.
జిల్లాలో ఇలా...: జోగులాంబ గద్వాల జిల్లాలో 189 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు సుమారు 38 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండేళ్ల కిందట రెండు విద్యా సంవత్సరాలు సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా 25 రకాల సామాగ్రితో కూడిన సైన్సు కిట్లు అందించారు. వీటి ద్వారా చాలా చోట్ల విద్యార్థులకు ప్రయోగ పాఠాలు అందాయి. గత విద్యా సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు కిట్ల ప్రభుత్వం నుంచి కిట్లు అందలేదు. దీంతో విద్యార్థులు కేవలం పుస్తక పాఠాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
అసంపూర్తిగా గదుల నిర్మాణం: ప్రయోగ పాఠాలకు ప్రత్యేక గదులు అవసరమని గుర్తించిన విద్యాశాఖ 2019 అక్టోబరులో ఎస్ఎస్ఏ ద్వారా గదుల నిర్మాణానికి రూ.1.44 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. 12 మండలాల పరిధిలో 16 ఉన్నత పాఠశాలలకు ప్రయోగశాల గదులు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 8 మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన చోట్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నిర్మించిన చోట ప్రయోగ పరికరాలు లేకపోవడంతో ఆ గదులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బడులకు వెళ్తున్న విద్యార్థులకు ప్రయోగ పాఠం అందని ద్రాక్షగానే మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
వస్తే అందిస్తాం: సైన్సు కిట్లు ఈ విద్యా సంవత్సరం కూడా రాలేదని, విద్యాశాఖ నుంచి వస్తే పాఠశాలలకు అందిస్తామని జిల్లా సైన్సు అధికారి భాస్కర్ పాపన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి