కాంగ్రెస్ వైపే ఉద్యోగుల మొగ్గు
ఉమ్మడి మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు కూడా కాంగ్రెస్కే జై కొట్టారు. పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిలో 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. వీరిలో ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
66.83 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ పార్టీకే..
భారాసకు 19.19, భాజపాకు 10.56 శాతం
ఈనాడు, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు కూడా కాంగ్రెస్కే జై కొట్టారు. పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిలో 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. వీరిలో ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరంతా ఎన్నికల విధుల్లో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉపయోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 22,151 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అందులో 21,141 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. 1,010 ఓట్లు వివిధ కారణాలతో తిరస్కరించడం లేదా చెల్లుబాటు కాలేదు. ఉమ్మడి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నమోదు సందర్భంగా తమకు అవకాశం కల్పించలేదని పలు చోట్ల నిరసనలు జరిగాయి. అయినా కూడా మొత్తం ఓట్లలో 95.44 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్కు 14,130 (66.83 శాతం) ఓట్లు, భారాసకు 4,058(19.19 శాతం) ఓట్లు, భాజపాకు 2,234 (10.56 శాతం) ఓట్లు, ఇతరులకు 719(3.40 శాతం) ఓట్లు వచ్చాయి. పోస్టల్ ఓట్లలో ఎక్కువగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో మెజార్టీ శాతం కాంగ్రెస్కే ఓట్లు వేయడం విశేషం. పాలమూరులోని ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. తర్వాత భారాసకు పడ్డాయి.
అధికార వర్గాల్లో చర్చ..: పాలమూరులోని అధికార వర్గాల్లో పోస్టల్ ఓట్ల నమోదుపై చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తుంది. ఉపాధ్యాయుల బదిలీలు, భార్యభర్తలను వేరువేరు జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడంపై ఉపాధ్యాయుల్లో కొంత వ్యతిరేకత ఉంది. విద్యాశాఖతోపాటు వివిధ శాఖల్లో పదోన్నతలు లేకపోవడం, సమయానికి జీతాలు రాకపోవడం వంటి కారణాలతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. ఈ కారణాలతోనే ఉద్యోగుల ఓటు బ్యాంకు హస్తం పార్టీవైపు మళ్లిందని ఆ సంఘం నేతలే కొందరు చెబుతుండడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు