పారదర్శక ఎన్నికకు సహకరించాలి
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో ఉప ఎన్నిక నిర్వహణ, ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు.
రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్
వనపర్తి, న్యూస్టుడే : మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో ఉప ఎన్నిక నిర్వహణ, ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈనెల 26న ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. వనపర్తి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ప్రతినిధులైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఓటర్లుగా ఉంటారన్నారు. పార్టీలకు ఓటరు జాబితా ఇస్తామని ఎవరిదైనా పేరు లేకున్నా, మార్పు చేర్పులున్నా ఫారం-17 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందో అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ ఉంటుందన్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఓటర్లకు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్డీవో పద్మావతి, భారాస, కాంగ్రెస్, భాజపా, సీపీఎం, తెదేపా, ఎంఐఎం పార్టీల నుంచి జమీల్, త్రినాథ్, వేణాచారి, ప్రవీణ్, మండ్లరాజు, బాలరాజు, రహీం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్