మహిళలకు వడ్డీ రాయితీ అందేనా?
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేస్తున్నాయి. క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్న మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణం పేరుతో తిరిగి వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది.
జిల్లాలో రూ. 62.85 కోట్ల మేర బకాయిలు
నాగర్కర్నూల్ : పెద్దకొత్తపల్లి ఐకేపీ కార్యాలయంలో మహిళలకు రుణాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
కందనూలు, న్యూస్టుడే : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేస్తున్నాయి. క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్న మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణం పేరుతో తిరిగి వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది. నాలుగేళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో మహిళలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సంఘాలకు వడ్డీ బకాయిల చెక్కులను అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలకు రూ.1,200 కోట్లు మంజూరు చేయాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని మహిళ సంఘాల సభ్యులు వడ్డీ రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. వడ్డీ త్వరగా మంజూరైతే ఆర్థిక ఊరట లభించనుందని పేర్కొంటున్నారు.
చివరగా 2019లో : జిల్లాలో మొత్తం 12,043 మహిళ సంఘాలున్నాయి. వీటి పరిధిలో 1,20,430 మంది సభ్యులున్నారు. సంఘాలకు చివరగా 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం 2019లో చెల్లించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వడ్డీకి అర్హత పొందిన సంఘాల వివరాలను జిల్లా డీఆర్డీవోశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నా.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన సంఘాల సభ్యులు మాత్రం ప్రతి నెల సక్రమంగా రుణాలు చెల్లిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు సంబంధించి జిల్లాకు రూ.62.85 కోట్ల మేరకు నిధులు విడుదల చేయాల్సి ఉందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. సంఘాలకు సక్రమంగా వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడం వలన కొందరు మహిళలు రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
మంజూరైన వెంటనే జమ చేస్తాం..
జిల్లాలో వడ్డీ పొందడానికి అర్హత సాధించిన సంఘాల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ఆయా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన సభ్యులు ప్రతి నెల సకాలంలో డబ్బులు చెల్లించాలి. రుణాలు సద్వినియోగం చేసుకునేలా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం.
చిన్నఓబులేశ్, డీఆర్డీఏ పర్యవేక్షణాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?