logo

రోడ్డు మార్గాన రాయచూర్‌కు కర్ణాటక గవర్నర్‌

రాయచూర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ గురువారం హాజరయ్యేందుకు హైదరాబాదు నుంచి గద్వాల్‌ మీదుగా రాయచూర్‌కు బుధవారం రోడ్డు మార్గాన వెళ్లారు.

Published : 29 Feb 2024 04:29 IST

గవర్నరుకు మొక్క ఇచ్చి స్వాగతం పలుకుతున్న కమాండెంట్‌ సాంబయ్య

కేటీదొడ్డి, న్యూస్‌టుడే : రాయచూర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ గురువారం హాజరయ్యేందుకు హైదరాబాదు నుంచి గద్వాల్‌ మీదుగా రాయచూర్‌కు బుధవారం రోడ్డు మార్గాన వెళ్లారు. కృష్ణా బ్రిడ్జి మరమ్మతుల కారణంగా అక్కడ రాకపోకలు నిలిపివేయడంతో గద్వాల్‌ మార్గాన గవర్నర్‌ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. గవర్నర్‌ వస్తుండటంతో కర్ణాటక, తెలంగాణ పోలీసు బృందాలు రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.

ఇటిక్యాల: కర్ణాటక గవర్నర్‌కు ఇటిక్యాల తహసీల్దార్‌ నరేందర్‌ ఎర్రవల్లిలో స్వాగతం పలికారు. రాయచూర్‌కు వెళ్తున్న ఆయన కొద్దిసేపు ఎర్రవల్లిచౌరస్తాలోని పదో పటాలంలో సేదతీరారు. కమాండెంట్‌ సాంబయ్య మొక్కను అందించి స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని