ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం
అయిజ మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులు బుధవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఉప్పల ఎంపీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డిని ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. మొత్తం 16 మంది ఎంపీటీసీ స్థానాలుండగా ఉత్తనూరు ఎంపీటీసీ సభ్యుడు తిరుమల్రెడ్డి మృతిచెందడంతో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 15కు చేరింది.
అయిజ : ప్రహ్లాదరెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
అయిజ, న్యూస్టుడే : అయిజ మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులు బుధవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఉప్పల ఎంపీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డిని ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. మొత్తం 16 మంది ఎంపీటీసీ స్థానాలుండగా ఉత్తనూరు ఎంపీటీసీ సభ్యుడు తిరుమల్రెడ్డి మృతిచెందడంతో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ప్రహ్లాదరెడ్డితో పాటు మిగిలిన 14 మంది సభ్యులు ప్రహ్లాదరెడ్డికి మద్దతుగా చేతులెత్తారు.ఎన్నికల అధికారి ప్రసాద్రావు ప్రహ్లాదరెడ్డిని ఎంపీపీగా ప్రకటించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎన్నికల అధికారి ప్రసాద్రావు చేతుల మీదుగా ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు. ఎంపీడీవో వెంకటయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు నారాయణ, మహేశ్ పాల్గొన్నారు.
దక్కించుకున్న భారాస: ఎంపికపై వారం రోజుల మందు నుంచే కసరత్తు జరిగింది. మండలంలోని ఎంపీటీసీ సభ్యులు కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వగృహానికి వెళ్లి చర్చించారు. 2019లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రహ్లాదరెడ్డి ఎంపీపీ కావాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేదు. దీంతో ఇప్పుడు అవకాశం ఇవ్వాలని సభ్యుల సమక్షంలో ఆయన ఎమ్మెల్సీ చల్లాను కోరారు.
కొల్లాపూర్ పట్టణం : అనివార్య కారణాలతో ఖాళీగా ఉన్న కొల్లాపూర్ ఎంపీపీ స్థానం బుధవారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవమైంది. కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్లో ఎంపీపీ ఎన్నిక నిర్వహించగా యన్మన్బెట్ల గ్రామానికి చెందిన భారాస ఎంపీటీసీ మాలే.రజితను ఎంపీటీసీ శంకర్నాయక్ ప్రతిపాదించగా రామాపురం ఎంపీటీసీ వరలక్ష్మి బలపరచింది. మిగితా వారు ఒప్పుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారి, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి గోపాల్నాయక్ చేతుల మీదుగా మాలే.రజిత నియామక పత్రం అందుకుంది. భారాసకు చెందిన ఎంపీటీసీల కోరం ఎక్కువగా ఉండడంతో ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ముక్కిడిగుండానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ భోజ్యనాయక్ ఎన్నికకు హాజరుకాలేదు. వైస్ ఎంపీపీ స్థానానికి మార్చి 1న అవిశ్వాస తీర్మానం ఉంటుందని ఎంపీడీవో పట్టాభిరామారావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాన్గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్గల్ : పాన్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు