తొలిరోజు ప్రశాంతం!
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉదయమే బయలుదేరి పరీక్ష సమయం కంటే ముందే చేరుకున్నారు.
మహబూబ్నగర్ : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి వస్తున్న విద్యార్థినులు
న్యూస్టుడే బృందం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉదయమే బయలుదేరి పరీక్ష సమయం కంటే ముందే చేరుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంట వచ్చి ధైర్యం చెప్పారు. కొందరు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా, గాయాల నొప్పులు తీవ్రంగా ఉన్నా పరీక్ష రాయాలన్న పట్టుదలతో వచ్చారు. తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కేంద్రాల వద్ద చిత్రాలు ఇవి.
నొప్పి బాధిస్తున్నా లెక్కచేయక..
ఈ చిత్రంలో కుటుంబ సభ్యుల సాయంతో ఇంటర్ పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థిని పేరు శైలజ. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం ఈర్లతండా స్వగ్రామం. మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సోమవారం శైలజకు అపెండిసైట్స్ శస్త్రచికిత్స చేశారు. వైద్యులు వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సంవత్సరం పాటు కష్టపడి చదివిన శైలజ మాత్రం పరీక్ష రాయడానికే నిర్ణయించుకుంది. నొప్పి బాధిస్తున్నా లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల సాయంతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చింది. ఆ దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్మనిపించింది.
వనపర్తి : డీసీఎంలో పరీక్ష కేంద్రానికి వచ్చిన గిరిజన గురుకుల విద్యార్థినులు
నాగర్కర్నూల్ : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద హాల్టిక్కెట్ల సంఖ్యలు చూసుకుంటున్న విద్యార్థినులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే