వాడీవేడి చర్చ.. జడ్పీ సమావేశం తీరు
సమస్యలపై వాడివేడీ చర్చ.. పరిష్కారంలో జాప్యంపై అధికారుల నిలదీత.. అభివృద్ధి పనులు, ప్రగతిపై ప్రశ్నల పరంపర.. ఇత్యాది అంశాల సమాహారంగా సిద్దిపేటలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది.
మాట్లాడుతున్న రోజాశర్మ, చిత్రంలో ఫారూఖ్హుస్సేన్, ప్రశాంత్ జీవన్ పాటిల్
న్యూస్టుడే, సిద్దిపేట: సమస్యలపై వాడివేడీ చర్చ.. పరిష్కారంలో జాప్యంపై అధికారుల నిలదీత.. అభివృద్ధి పనులు, ప్రగతిపై ప్రశ్నల పరంపర.. ఇత్యాది అంశాల సమాహారంగా సిద్దిపేటలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సోమవారం జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సభ్యులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో జడ్పీ అధ్యక్షురాలు.. ఎప్పటికప్పుడు సభ్యులను సమన్వయంతో శాంతపర్చుతూ సభను ముందుకు నడిపించారు. ఒకానొక దశలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రస్తావన రాకతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు, ఆరోగ్య మహిళా క్లినిక్ల ఏర్పాటుపై మంత్రి హరీశ్రావు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తయింది. జడ్పీ అధ్యక్షురాలు సహా ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, జడ్పీ సీఈవో రమేశ్ పాల్గొన్నారు. సభ్యులు పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. 11 శాఖలతో ప్రగతి నివేదిక సమర్పణ, చర్చలతో సమావేశాన్ని ముగించారు. పంచాయతీరాజ్ పరిధిలో ధర్మారం-లక్కపల్లి రహదారి నిర్మాణం ఏళ్లుగా పూర్తి కావడం లేదంటూ మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో జిల్లా ముందుందని, అసలు పరిష్కారమవటం లేదంటూ వ్యాఖ్యానించడం తగదని అధ్యక్షురాలు అన్నారు. చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం మృతిపై సంతాపం ప్రకటిస్తూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
పూర్తి స్థాయిలో సభ్యులు హాజరు కాకపోవడంతో ఖాళీగా కుర్చీలు
ప్రధాన సమస్యలు
* జగదేవపూర్, కోహెడ మండలాల్లో వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. మద్దూరు మండలంలో వరికి మొగి పురుగు సోకి నష్టపోయే పరిస్థితి నెలకొంది.
* బెజ్జంకి, చేర్యాల మండలాల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. వర్గల్లో రూ.కోట్లు వెచ్చించి బస్టాండ్ నిర్మించినా బస్సులు రావడం లేదు.
* వర్గల్, చేర్యాల మండలాల్లో పింఛను మంజూరు అయినా ఖాతాల్లో సొమ్ము పడటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట