పవిత్ర మాసం.. సర్వశుభాల సమాహారం
పవిత్ర రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇది సర్వశుభాల సమాహారం. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో అల్లా ఆజ్ఞలను అనుసరించి మహ్మద్ ప్రవక్త ప్రబోధాలు ముస్లింలు తూచా తప్పకుండా ఆచరిస్తారు.
నేటి నుంచి రంజాన్ ప్రారంభం
పవిత్ర రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇది సర్వశుభాల సమాహారం. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో అల్లా ఆజ్ఞలను అనుసరించి మహ్మద్ ప్రవక్త ప్రబోధాలు ముస్లింలు తూచా తప్పకుండా ఆచరిస్తారు. మంచిని పెంచేందుకు, చెడు రూపుమాపడానికి అల్లా దివ్య సందేశాలిచ్చారు. పర్వదినాల్లో ఫిత్రా (దానాలు) చేస్తారు. నెల రోజుల పాటు నిత్యం సహర్ (తెల్లవారుజామున భోజనం), ఇఫ్తార్ (సూర్యాస్తమయం సమయంలో దీక్ష విరమణ) ఆచరిస్తారు.
రోజా: రోజాను ‘సౌమ్’, ‘సియామ్’ అని పిలుస్తారు. రోజా దీక్షాదారుడిని సాయమ్ అంటారు. రోజా అంటే ప్రభాత పూర్వసమయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు త్యజించడం, లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవడం అని అర్థం.
రంజాన్: అరబిక్ భాషలో ‘రమ్జ్’ అంటే కాలడం అని అర్థం. ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింప చేయడంతో ఆత్మలోని మలినాలు ప్రక్షాళనమై సర్వపాపాలు దహించుకుపోతాయి.
మూడు భాగాలు: మహ్మద్ ప్రవక్త రంజాన్ మాసాన్ని మూడు భాగాలుగా విభజించారు. తొలి అంకం పది రోజులు దైవ కృపాకటాక్షాలకు, రెండో పది రోజులు దైవ క్షమాపణలకు, చివరగా నరకం నుంచి విముక్తి కలిగించి సాఫల్యం పొందేందుకు నిర్దేశించారు.
సర్వం సిద్ధం
రంజాన్ను పురస్కరించుకొని ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రోజా పాటించడం, ఖురాన్ పఠనం, తరావీ నమాజ్ ఆచరించేందుకు మసీదుల్లో సర్వం సిద్ధం చేశారు. సుందరంగా తీర్చిదిద్దారు. పలు చోట్ల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. తరావీ నమాజ్ చదివేందుకు హఫేజ్-ఏ-ఖురాన్ (ఖురాన్ కంఠస్థం చేసిన గురువులు)లను సైతం నియమించారు. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వారిని పిలిపించారు.
న్యూస్టుడే, వెల్దుర్తి, బొంరాస్పేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి