Harish Rao: మీ కోసం 18 గంటలు శ్రమిస్తున్నా: మంత్రి హరీశ్
‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబం. మీకోసం రోజులో 18 గంటలు శ్రమిస్తున్నా. నేను ఎక్కడున్నా ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది. మరింత సేవ చేసేందుకు ప్రేమ, ఆశీర్వాదం అందించాలి..’ అని మంత్రి హరీశ్రావు అన్నారు.
మరింత సేవ చేసేందుకు ఆశీర్వదించండి: మంత్రి హరీశ్రావు
బ్యాడ్మింటన్ ఆడుతున్న హరీశ్రావు
సిద్దిపేట, సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: ‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబం. మీకోసం రోజులో 18 గంటలు శ్రమిస్తున్నా. నేను ఎక్కడున్నా ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది. మరింత సేవ చేసేందుకు ప్రేమ, ఆశీర్వాదం అందించాలి..’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలో రూ.లక్ష చొప్పున బీసీ బంధు చెక్కులను నియోజకవర్గంలోని 400 మంది లబ్ధిదారులకు అందించారు. గృహలక్ష్మి పథకం కింద మరో 400 మందికి మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేశారు. చిన్నకోడూరు మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. వెట్టిచాకిరి విముక్తి కింద బాధితులకు స్థల పట్టాలు, కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రతులను అందజేసి మాట్లాడారు. దేశానికి తెలంగాణ నమూనా అయితే.. రాష్ట్రానికి సిద్దిపేట అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత గౌరవాన్ని ఇనుమడింపజేశామన్నారు. జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక బీసీ బంధు సాయం అందించిన జాబితాలో సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, మున్సిపల్ అధ్యక్షురాలు మంజుల, సుడా ఛైర్మన్ రవీందర్రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మాజీ ఛైర్మన్ రాజనర్సు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్, ఎస్సీ, బీసీ అభివృద్ధి శాఖల అధికారులు శ్రీరాంరెడ్డి, హరికృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
క్రీడాభివృద్ధికి పెద్దపేట
క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇప్పటి వరకు రూ.11 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. స్పోర్ట్స్ క్లబ్ కోరిక మేరకు కబడ్డీ, ఖోఖో కోర్టులు, రన్నింగ్ ట్రాక్ త్వరలో మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేటలోని లఘు క్రీడా మైదానం వద్ద రూ.1.50 కోట్లతో నిర్మించిన బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ రావుల శ్రీధర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. నెలన్నర వ్యవధిలో రెండు కోర్టులను నిర్మించి ప్రారంభించేందుకు కృషి చేసిన శ్రీధర్రెడ్డిని అభినందించారు. బ్యాడ్మింటన్ ఆడారు. వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మన్నె మహేశ్కుమార్, కార్యదర్శి వంశీ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలో తŸక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?