రూ.కోట్లు వెచ్చించి.. మధ్యలో ఆపేసి..
అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేస్తున్నప్పటికీ అవి పూర్తి కావడం లేదు. నర్సాపూర్లో ఇదే పరిస్థితి నెలకొంది.
న్యూస్టుడే, నర్సాపూర్: అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేస్తున్నప్పటికీ అవి పూర్తి కావడం లేదు. నర్సాపూర్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన సామాజిక భవనాల నిర్మాణాలు పూర్తికాలేదు. ఆయా వర్గాల వారికి భవనాలు మంజూరు చేసిన ప్రజాప్రతినిధులు ఆ తర్వాత వాటి పురోగతిని పట్టించుకోవడంలేదు. పట్టణంలోని సునీతాలక్ష్మారెడ్డి కాలనీలో రూ.10లక్షలతో మహిళా మండలి భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించినా, పనులు పూర్తికాలేదు. తలుపులు, కిటికీలు ఏర్పాటుచేసి ఫ్లోరింగ్ చేస్తే భవనం అందుబాటులోకి వస్తుంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు మరిన్ని నిధుల కోరుతూ ప్రతిపాదనలు పంపారు. ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న సామాజిక భవనానిది ఇదే పరిస్థితి. రూ.10లక్షలు కేటాయించగా రెండంతస్తులతో స్లాబు వేశారు. ఏడాదిగా పనులు అసంపూర్తిగా దర్శనం ఇస్తున్నాయి. గౌడ సామాజిక భవనానికి రూ.కోటికిపైగా ఖర్చు చేసి స్లాబు వేసి వదిలేశారు.
అసంపూర్తిగా దుకాణ సముదాయం: 13వ వార్డులో కబేళాను తొలగించి, ఆ ప్రాంతంలో భవన నిర్మాణానికి రూ.50లక్షలు కేటాయించారు. నిధులున్నంతమేరకు పనులు చేపట్టి మధ్యలో వదిలేశారు. కొంతవరకు ఇటుక గోడలు ఏర్పాటు చేసి ప్లాస్టరింగ్ చేయలేదు. పూర్తి చేసేందుకు మరో రూ.కోటి కేటాయించినా, పనులు సాగడంలేదు. పట్టణంలోని శాఖా గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా అభివృద్ధి పర్చడంలో భాగంగా రూ.50లక్షలు కేటాయించారు. వీటితో మూడంతస్తుల భవనం నిర్మించి స్లాబు వేశారు. మిగతా పనులు పూర్తిచేయలేదు.
పదేళ్లుగా పర్యాటక హోటల్..: నర్సాపూర్ - హైదరాబాద్ మార్గంలో పర్యాటక హోటల్ నిర్మాణానికి రూ.70లక్షలు మంజూరు చేశారు. పనులు ప్రారంభించిన గుత్తేదారు పునాదులు తీసి పిల్లర్లతో వదిలేశారు. దాదాపు పదేళ్లు అవుతున్నా, ముందుకు సాగడంలేదు. ఇనుప చువ్వలు తుప్పుపట్టాయి. దివ్యాంగుల ప్రభుత్వ వసతి గృహానిది ఇదే పరిస్థితి. ఈవిషయాన్ని ఏఈ స్వామిదాసు వద్ద ప్రస్తావించగా.. అసంపూర్తి పనులకు అదనంగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. కొన్నింటికి నిధులు కేటాయిస్తుండగా, మరికొన్నింటికి మంజూరు కావడం లేదు. వచ్చిన వాటి పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం