ఓటరు చైతన్యానికి విస్తృత ప్రచారం
లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ వెలువడగా, త్వరలో నోటిఫికేషన్ రానుంది
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ వెలువడగా, త్వరలో నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ తదితర ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో ఓటరు కీలకం కావడంతో... వారి చైతన్యమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గోడపత్రికలు, కరపత్రాలు, పుస్తకాలతో విస్రృత ప్రచారానికి ఏర్పాట్లు చేసింది.
మార్గనిర్దేశం: ఓటర్లు ఓటు వేయడం ద్వారానే ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారు. ఎన్నికల ప్రకియకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ‘ఓటరు గైడ్’ అనే చిన్న పుస్తకాన్ని(బుక్లెట్) ముద్రించింది. ఇందులో ఓటరుగా రిజస్ట్రేషన్ ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ, ఓటు వేసే విధానం, ఎన్నికల సంఘం యాప్ సదుపాయాలు, ఓటర్ల ప్రతిజ్ఞ తదితర అంశాలను పొందుపర్చారు. వీటిని బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి అందజేయనున్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదు, ఏయే తేదీల్లో కొత్తగా ఓటరుగా నమోదయ్యే వివరాలు, పోలింగ్ ప్రక్రియ ఏవిధంగా ఉంటుందనే.. చిత్రాలతో కూడిన వివరాలు ఇందులో ఉన్నాయి. సీ-విజిల్, ఓటర్ హెల్ప్లైన్, సాక్ష, నో యువర్ క్యాండిడేట్ యాప్ల గురించి కూడా వివరించారు.
అవగాహన పెంపొందించేలా..: ఓటు వేసే విధానం, పోలింగ్ కేంద్రంలో పాటించాల్సిన పద్ధతులు, తీసుకెళ్లాల్సిన గుర్తింపు పత్రాలు, పోలింగ్ సిబ్బంది చేయవలసినవి, చేయకూడని వాటి వివరాలతో గోడ పత్రికలు సిద్ధం చేశారు. వీటిని ప్రతి పోలింగ్ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. ఓటు వేసేందుకు అవసరమయ్యే పత్రాల గురించి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్ల వద్ద ప్రదర్శిస్తున్నారు. తదితరాలను వివరిస్తారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సామగ్రిని మండలాలకు, అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించన్చున్నారు.
నియోజకవర్గం ఓటర్లు
నారాయణఖేడ్ 2,36,377
అందోలు 2,50,086
జహీరాబాద్ 2,74,196
సంగారెడ్డి 2,48,026
పటాన్చెరు 4,10,003
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత