జల వనరులపై పట్టింపేది?
చెరువుల్లో ఎంత నీరున్నా తూములు, కాల్వలు బాగుంటేనే ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. జిల్లాలో సాగునీటి వనరులు తక్కువున్న ప్రాంతం నారాయణఖేడ్ నియోజకవర్గం. ఇక్కడున్న పలు చెరువుల తూములు, వాటి షట్టర్లు శిథిలమయ్యాయి.
శిథిలమైన తూములు, కాల్వలు
గట్లింగంపల్లి ప్రాజెక్టు కింద బీడుగా భూములు
న్యూస్టుడే, నారాయణఖేడ్: చెరువుల్లో ఎంత నీరున్నా తూములు, కాల్వలు బాగుంటేనే ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. జిల్లాలో సాగునీటి వనరులు తక్కువున్న ప్రాంతం నారాయణఖేడ్ నియోజకవర్గం. ఇక్కడున్న పలు చెరువుల తూములు, వాటి షట్టర్లు శిథిలమయ్యాయి. కాల్వలు పూడుకుపోయాయి. రెండు ప్రాజెక్టులకు కాల్వలే లేవు. అధికారులు వర్షాకాలం ప్రారంభంలోగా పక్కాగా మరమ్మతులు చేస్తే సత్ఫలితాలు ఉంటాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో..
ఖేడ్ నియోజకవర్గంలో ఖేడ్, మనూరు, నాగల్గిద్ద, కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్, నిజాంపేట, పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవరం్గలో 100 ఎకరాలకు పైబడి ఆయకట్టున్న చెరువులు 39. వాటికింద 16,791 ఎకరాల నిర్దేశిత ఆయకట్టు ఉంది. ఆయా చెరువులు ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఏడేళ్ల కిందట మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడికతీతకు ప్రాధాన్యమిచ్చినా.. కాల్వలు, తూముల మరమ్మతులను విస్మరించారనే విమర్శలున్నాయి. అనేక చెరువుల తూములు దెబ్బతిని నీరంతా వృథా అవుతోంది. అలుగులు కూలాయి. కాల్వలు శిథిలమయ్యాయి. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు.
కొన్నింటికి కాల్వలు లేవు
చెరువుల్లోని నీరు చివరి ఆయకట్టుకు పారాలంటే కాల్వలు బాగుండటం ముఖ్యం. అన్ని చెరువులకు కాల్వలు ఉంటాయి. కానీ ఖేడ్ నియోజకవర్గంలోని రెండు ప్రాజెక్టులకు కాల్వలు అసలే లేవు. దీంతో వర్షాకాలంలో ఆయా ప్రాజెక్టులు నిండుతున్నా వాటి కింద భూములు బీడుగా ఉంటున్నాయి. ఖేడ్ మండలంలోని ఉజలంపాడ్లో 17 ఏళ్ల కిందట రూ.1.20 కోట్లతో 580 ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. కాల్వలను విస్మరించారు. దీంతో ప్రాజెక్టు నిండినా సాగుకు నీరందించలేని పరిస్థితి నెలకొంది.
మనూరు మండలం గట్లింగంపల్లిలో 15 ఏళ్ల కిందట రూ.60 లక్షలు వెచ్చించి 205 ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో గతంలో ప్రాజెక్టును నిర్మించారు. దీనికీ కాల్వలు నిర్మించలేదు. కొందరు రైతులు కాల్వ తవ్వుకొని 40 ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నారు. కాల్వలు నిర్మించాలని రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. మనూరు మండలంలో 100 ఎకరాలకు పైబడి ఆయకట్టున్న చెరువులు రెండే కాగా.. అందులో ఒకటైన గట్లింగంపల్లి ప్రాజెక్టు పరిస్థితి అధ్వానంగా మారింది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?