జలశుద్ధి కేంద్రంతో మహర్దశ
జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు కుంటల్లో నీరు లేదు. వాటికి భిన్నంగా కుకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామంలోని దుడ్డె చెరువు, నల్ల చెరువులు మాత్రం మత్తడి పారుతున్నాయి
వ్యర్థ జలాలతో మంగోల్లో నిశ్చింతంగా పంటల సాగు
మంగోల్లో దుడ్డె చెరువు
కొండపాక గ్రామీణం, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు కుంటల్లో నీరు లేదు. వాటికి భిన్నంగా కుకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామంలోని దుడ్డె చెరువు, నల్ల చెరువులు మాత్రం మత్తడి పారుతున్నాయి. పంట పొలాలకు పూర్తిగా నీళ్లందిస్తున్నాయి. దీనికంతా మంగోల్లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ తాగునీటి జలశుద్ధి కేంద్రం కారణం. మల్లన్నసాగర్ జలాశయం ఆధారంగా మంగోల్ గ్రామంలో 540 ఎంఎల్డీల సామర్థ్యంతో జలశుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. దీని నుంచి సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 పట్టణాలు, 1,922 ఆవాసాలకు తాగునీరు సరఫరా అవుతుంది. మంగోల్ కేంద్రంలో జలాల శుద్ధి ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది.
కాలువల్లోకి మళ్లింపు..
భారీ మొత్తంలో వ్యర్థ జలాలు శుద్దికేంద్రం నుంచి బయటకు విడుదల అవుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి పిల్ల కాలువలు నిర్మించుకొని గ్రావిటీ ద్వారా దుడ్డె, నల్ల చెరువులకు మళ్లించారు. రెండు చెరువుల్లోకి నీరు చేరడంతో నిండి మత్తడి పారుతున్నాయి. మత్తడి పారుతుండగా జలాలను పొలాల్లోకి వెళ్లకుండా గ్రామస్థులు మల్లన్నసాగర్ కాలువల్లోకి మళ్లించారు. ఈ ప్రాంతంలో నీటి కొరత లేకపోవడంతో రైతులు నిశ్చింతంగా పంటలు పండించుకుంటున్నారు. భవిష్యత్తులోనూ మంగోల్కు సాగునీటికి కష్టాలు ఉండవని గ్రామస్థులు చెబుతున్నారు. సంవత్సరానికి రెండు పంటలు పండించగలుగుతున్నామంటున్నారు. గ్రామంలో నివసిస్తున్న దాదాపు 100కు పైగా మత్స్యకారుల కుటుంబాలకు చెరువుల ద్వారా ఉపాధి లభిస్తోంది. వ్యర్థ జలాలను వృథా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నామని.. ఏడాదిన్నరగా రెండు చెరువులూ మత్తళ్లు దూకుతున్నాయని మాజీ సర్పంచి పుల్లోజు కిరణ్కుమార్ తెలిపారు.
ఏడెకరాల్లో వరి వేశా: బాపురెడ్డి, రైతు, మంగోల్
శుద్ధి కేంద్రం నుంచి వెలువడే వ్యర్థ జలాల ఆధారంగా నేను ఏడెకరాల భూమిలో వరి సాగు చేపట్టా. గతంలో కేవలం మూడెకరాల్లో వరి వేస్తుంటి. వేసవిలో నీరందక కొంత ఎండిపోయేది. గ్రామంలో సాగునీటికి ఇబ్బందులు తొలగిపోవడంతో ఇతర రైతులు బీడు భూములను సాగులోకి తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్