భాజపా, కాంగ్రెస్ బడేమియా, ఛోటేమియాలాంటివి
అబద్ధాల్లో భాజపా బడేమియా అయితే కాంగ్రెస్ ఛోటేమియా లాంటిదని, ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని, ఇద్దరూ కలసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
ఎమ్మెల్యే హరీశ్రావు
మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట టౌన్: అబద్ధాల్లో భాజపా బడేమియా అయితే కాంగ్రెస్ ఛోటేమియా లాంటిదని, ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని, ఇద్దరూ కలసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో పుట్ల కొద్దీ వడ్లు పండితే కాంగ్రెస్ ప్రభుత్వంలో పుట్టెదు దుఃఖం మిగిలిందన్నారు. సిద్దిపేటలోని కొండ భూదేవిగార్డెన్స్లో పట్టణ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన ఎల్ఈడీ తెరపై గత ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలు ఇచ్చిన హామీలను చూపారు. నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై విసుగు చెందారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలని కాంగ్రెస్ మీద కోపంతో భాజపాకు ఓటేస్తే పెనం మీది నుంచి పొయ్యిల పడ్డట్లు అవుతది పరిస్థితి అన్నారు. భాజపా నాయకులు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధపు వాగ్దానాలతో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్రావు ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. భాజపా, కాంగ్రెస్లు ఒక్కటై కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలిపారన్నారు. కలెక్టర్గా అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డికి జిల్లా భౌగోళిక పరిస్థితులు అన్ని తెలుసని, ఆయన కృషి వల్లే అగ్రభాగాన నిలిచిందన్నారు. అలాంటి వ్యక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సిద్దిపేట పౌరుషం చూపాలన్నారు. కార్యకర్తలు ఎట్టిపరిస్థితుల్లో కూడా ఏమరపాటుగా ఉండొద్దన్నారు. అనంతరం పలు సంఘాల ప్రతినిధులు వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఉంటామని తీర్మాన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బల్దియా అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షుడు కనకరాజు, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ పాల్గొన్నారు.
పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఆకుల బాలయ్య... నాయకం వెంకటలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా హరీశ్రావు వారి కుటుంబాలను పరామర్శించారు.
నంగునూరు: ముండ్రాయి గ్రామానికి చెందిన భారాస యువజన విభాగం అధ్యక్షుడు, గ్రామ క్రికెట్ టీం కెప్టెన్, గీతా కార్మికుడు సాదుపల్లి జగదీశ్ మృతికి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు లింగం గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ