సైబర్ మోసం కట్టడి కి వ్యూహం
‘సెల్ఫోన్కు వచ్చిన లింకును ఓపెన్ చేసి డబ్బులు పెట్టుబడిగా పెడితే అధిక లాభాలు వస్తాయని గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సందేశాన్ని నమ్మి గుమ్మడిదల మండలం అన్నారానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మోసపోయాడు.
ప్రతి పోలీసు స్టేషన్లో ‘వారియర్ల’కు బాధ్యతలు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్: ‘సెల్ఫోన్కు వచ్చిన లింకును ఓపెన్ చేసి డబ్బులు పెట్టుబడిగా పెడితే అధిక లాభాలు వస్తాయని గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సందేశాన్ని నమ్మి గుమ్మడిదల మండలం అన్నారానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి రూ.1.78 లక్షలు నష్టపోయాడు. బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయగా గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.’
హైదరాబాద్కు అత్యంత సమీపంలో జిల్లా ఉండటంతో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నారు. వీటిలో ఎక్కువ కేసులు పటాన్చెరు, అమీన్పూర్ పోలీసు సేషన్ల పరిధిలోనే ఉంటున్నాయి. వాటి ఛేదన పోలీసులకు సవాల్గా మారుతోంది. ఈ రెండు ఠాణాల పరిధిలో నిత్యం రెండు నుంచి మూడు కేసులు నమోదవుతున్నాయి. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కార్మికులే ఎక్కువగా ఉంటున్నారు. అక్షర జ్ఞానం లేనివారు మోసపోతున్న ఘటనలకంటే.. చదువుకున్న బాధితులే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో సైబర్(ఆన్లైన్) మోసాలకు చెక్ పెట్టడంపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి పోలీసు స్టేషన్లో సైబర్ వారియర్లను నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. కేసుల ఛేదనలో వీరిపాత్రే కీలకం.
నిత్యం పర్యవేక్షణ: జిల్లాలోని 29 పోలీసు స్టేషన్ల పరిధిలో సైబర్ నేరాలపై ‘1930’ నంబర్కు వచ్చిన ఫిర్యాదులపై సైబర్ వారియర్లు కేసు నమోదు చేస్తారు. ప్రతి రోజుల కేసుల వివరాలు, వారి దర్యాప్తు తీరుపై డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి పర్యవేక్షిస్తుంటారు. సీఐ, ఇద్దరు ఎస్ఐలు సహాయకంగా ఉంటారు. ఫిర్యాదు అందిన వెంటనే పూర్తి వివరాలు తెలుసుకొని విచారణ చేస్తున్నారు. మరోసారి బాధితుడు మోసపోకుండా అవగాహన కల్పిస్తున్నారు.
సైబర్ వారియర్లకు చరవాణులు పంపిణీ చేస్తున్న ఎస్పీ రూపేష్
అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం..
సైబర్ నేరాలపై అవగాహన సదస్పులు నిర్వహిస్తున్నాం. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, డెబిట్కార్డ్ పాస్వర్డులు ఇతరులకు చెప్పవద్దు. అపరిచిత వ్యక్తులు ఫోన్చేసి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే మాటలు నమ్మవద్దు. సామాజిక మాధ్యమాల్లో బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మి అత్యాశకు పోయి మోసానికి గురికావద్దు. సైబర్ మోసానికి గురయిన బాధితులు వెంటనే ‘1930’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. సైబర్ వారియర్లు కేసుల ఛేదనలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
- వేణుగోపాల్రెడ్డి, డీఎస్పీ, సంగారెడ్డి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం