జోరుగా జూదం.. జీవితాలు ఛిద్రం
ప్రభుత్వం నిషేధించిన జూదం జిల్లాలో జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లోని క్లబ్లకు వెళ్లిన జూదరులు ఇప్పుడు మారుమూల పల్లెల్లోనే మకాం వేస్తున్నారు.
మూడు నెలల్లోనే 24 స్థావరాలపై దాడులు.. 78 మంది అరెస్టు
న్యూస్టుడే, చేర్యాల: ప్రభుత్వం నిషేధించిన జూదం జిల్లాలో జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లోని క్లబ్లకు వెళ్లిన జూదరులు ఇప్పుడు మారుమూల పల్లెల్లోనే మకాం వేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరు యువకులు, గ్రామాల్లోని అమాయకులకు ఎరవేసి ఇందులోకి లాగుతున్నారు. కొంతకాలంగా పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో పట్టుబడిన వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
గుట్టలు, చెట్ల పొదలే స్థావరాలు
నివాసాలతో పాటు జనసంచారం తక్కవగా ఉండే గుట్టలు, గుబురుగా ఉండే చెట్ల పొదలే జూదానికి ప్రధాన అడ్డాలవుతున్నాయి. వాగుల పక్కన ఉన్న చిన్నపాటి అడవులు, రైతులు పెంచుతున్న తోటల్లోనూ ఆడుతున్నారు. పోలీసులు వస్తున్నప్పుడు సమాచారం ఇవ్వడానికి కొందరిని కాపలాగా పెట్టుకుంటున్నారు. వారికి సుమారు రూ.5 వేల వరకు ఇస్తుంటారు. జూదమాట నిర్వహణే ఉపాధిగా కొందరు మలుచుకున్నారు. రహస్య అడ్డాలు ఏర్పాటు చేసి, ఫోన్లు చేసి ఆటగాళ్లను రప్పించినందుకు ఒక్కో ఆటకు రూ.1 వేయి నుంచి రూ.3 వేల వరకు నిర్వాహకులు తీసుకుంటున్నారు.
క్లబ్ తరహాలో టోకెన్ల విధానం
పట్టణాలు, నగరాల్లోని క్లబ్బుల మాదిరిగా పల్లెల్లోనూ నిర్వాహకులు డబ్బు డిపాజిట్ చేసిన వారికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇటీవల చేర్యాల మండలం చుంచనకోట గుట్టల్లో పోలీసులు దాడి చేసినపుడు కాయిన్లు దొరకడం ఇందుకు నిదర్శనం. జూదంలో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వ్యాపారులు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు... యువత, విద్యార్థులు మాత్రం రూ.500 నుంచి రూ.5000 వరకు ఆటలో పణంగా పెడుతున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఇళ్లల్లోనే ఆడుతున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుంటున్నారు.
ఓవైపు కౌన్సిలింగ్.. మరోవైపు కఠిన చర్యలు
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు కాగా రూ.4,45,212 నగదు స్వాధీనం చేసుకున్నారు. కొందరు పరారీలో ఉండగా 78 మందిని అరెస్టు చేశారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న జూదం నియంత్రించాలంటే కౌన్సిలింగ్ చేయాలి. కఠిన చర్యలు, శిక్షల ద్వారా కట్టడి చేయాలి. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దాడులతో కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి.
కొన్ని సంఘటనలు
- మార్చి 20న చుంచనకోట శివారు మామిడి తోటలో హైదరాబాద్ నుంచి వచ్చి ఆడారు. దాడులతో పారిపోయారు. రూ.10 వేల టోకెన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దూరులో ఇటీవల ఆరుగురిని అరెస్టు చేశారు.
- మార్చి 21న సిద్దిపేట గ్రామీణ ఠాణా పరిధి బంజేరుపల్లి శివారులో చెట్ల మధ్య ఆడుతున్న ఏడుగురు పట్టుబడ్డారు.
- మార్చి 26న సిద్దిపేట టూటౌన్ పరిధిలో టాస్క్ఫోర్స్, పోలీసుల దాడిలో ఏడుగురు అరెస్టయ్యారు.
- ఏప్రిల్ 7న సిద్దిపేట వన్టౌన్ పరిధిలోని కంచర్ బజార్లోని ఓ ఇంట్లో జూదం ఆడుతూ ఆరుగురు దొరికారు.
- చేర్యాల పట్టణం 4వ వార్డులో ఈనెల 10న ప్రైవేటు క్లినిక్లో సోదాలు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
- ఈ సంఘటనల్లో మొత్తం రూ.1,16,187 నగదు, 35 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం ఇవ్వండి, చర్యలు తీసుకుంటాం
-అనూరాధ, సీపీ
తక్కువ సమయంలో, ఏమీ కష్టపడకుండానే ఎక్కువ సంపాదించవచ్చన్న దురాశే కుటుంబాల ఛిన్నాభిన్నానికి కారణమవుతోంది. జూదం నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ‘టాస్క్ఫోర్స్’ని ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. ఎక్కడైనా జూదం ఆడుతున్నా.. అనుమతి లేకుండా ఇసుక, రేషన్ బియ్యం రవాణా చేసినట్టు ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. చర్యలు తీసుకుంటాం. సిద్దిపేట టాస్క్ఫోర్స్ అధికారుల ఫోన్ నంబర్లు 87126 67445, 87126 67446, 87126 67447. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?