మత్తులో కారు నడిపి.. కుటుంబంలో విషాదాన్ని నింపి..
మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తి, ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతిచెందగా, వివాహం జరగాల్సిన యువతితోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం, ఆరుగురికి గాయాలు
తూప్రాన్, చేగుంట: మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తి, ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతిచెందగా, వివాహం జరగాల్సిన యువతితోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తూప్రాన్ శివారులో జరిగింది. ఎస్సై శివానందం తెలిపిన ప్రకారం.. మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లికి చెందిన అంబర్పేట యాదగిరి, మంజుల దంపతుల కూతురి వివాహం ఈ నెల 24వ తేదీన జరగాల్సి ఉంది. ఈ సందర్భంగానే వస్త్రాల కొనుగోలుకు దంపతులతోపాటు, పెళ్లి జరగాల్సిన యువతి, యాదగిరి తమ్ముడు బాలకృష్ణ, రాధ దంపతులు వారి ఇద్దరు కుమారులు అఖిల్(15), అరవింద్తో కలిసి ట్రాలీ ఆటోలో తూప్రాన్కు వస్తున్నారు. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై హల్దీవాగు వంతెన సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన కారు.. ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన అఖిల్పై నుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మరో ఆరు మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి తూప్రాన్ పురపాలిక పరిధి పోతరాజ్పల్లికి చెందిన యస్కి నవీన్గౌడ్గా పోలీసులు గుర్తించారు. మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
కుమారుడిని కోల్పోయి..: అఖిల్ చందాయిపేటలో ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఇటీవలే పరీక్షలు రాశాడు. తమ కళ్లముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘ఉన్నత చదువులు చదివి, ఇంటికి వెలుగు అవుతావని అనుకున్నాం బిడ్డా, ఇంతలోనే దేవుడు అన్యాయం చేశాడని’ శోకంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అరవింద్ గ్రామంలోనే ఆరో తరగతి చదువుతున్నాడు. గాయాలతోనే అన్న మృతదేహం వద్ద విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
సదాశివపేట: మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సదాశివపేట పట్టణంలో జరిగింది. సీఐ మహేష్గౌడ్ తెలిపిన ప్రకారం మండలానికి చెందిన ఓ కుటుంబం పట్టణంలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె (17) బీఫార్మసీ చదువుతోంది. వివిధ కారణాలతో రెండు నెలలుగా మానసిక వేదనతో ఇంట్లోనే ఉంటోంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో పంకాకు ఊరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ‘నా మరణానికి ఎవరు కారణం కాదని ఉత్తరంలో పేర్కొందని సీఐ చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
మూసాపేట, న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన ప్రకారం..మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతారాంనగర్ గ్రామానికి చెందిన లంగడి రమేష్(20) రెండేళ్ల క్రితం నగరానికి వలసొచ్చాడు. కూకట్పల్లి ప్రకాష్నగర్లోని అతని అన్న ప్రసాద్ ఇంటికి సమీపంలోని ఓ గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. ‘డెలివరీ బాయ్’గా పనిచేస్తున్న అతడికి కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా రమేష్ ఫోన్ ఎత్తకపోవడంతోపాటు కన్పించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు ఆదివారం రాత్రి అతడి గదికి వెళ్లి చూశారు. అప్పటికే అతడు గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయి కన్పించాడు. శనివారమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఒకరు..
మెదక్, న్యూస్టుడే: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మెదక్లో వెలుగు చూసింది. పట్టణ సీఐ దిలీప్కుమార్ తెలిపిన వివరాలు.. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన కుర్తివాడ మల్లేశం(49) పని నిమిత్తం ఆదివారం మెదక్ పట్టణానికి వచ్చారు. సోమవారం ఉదయం స్థానిక బంగ్ల చెరువులో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్ద మృతుడి ద్విచక్ర వాహనం, చరవాణి లభించింది. తన భర్త మృతిపై అనుమానం ఉందని భార్య యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే