అడవిలో అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట
వేసవిలో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. వృక్షాలు కాలిపోవడంతో పాటు వన్యప్రాణులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతుంటాయి.
న్యూస్టుడే, నర్సాపూర్: వేసవిలో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. వృక్షాలు కాలిపోవడంతో పాటు వన్యప్రాణులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతుంటాయి. ఆకులు రాలే ఈ కాలంలో చిన్న నిప్పు రాజుకున్నా అడవి అంతా వ్యాపిస్తుంది. దీనికి తోడు ఆకతాయిలు, అక్రమార్కులు అడవులకు నిప్పంటిస్తుంటారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వేసవిని దృష్టిలో పెట్టుకొని అడవుల్లో మంటలు విస్తరించకుండా ఫైర్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్ల పొడవునా వీటిని ఏర్పాటు చేస్తూ అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా అగ్నిమాపక దుస్తులు అందజేశారు. ఎక్కడ మంటలు అంటుకున్నా పొగ ద్వారా ప్రమాదం ప్రాంతాన్ని శాటిలైట్ ద్వారా సమాచారం అధికారులకు అందుతుంది. వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని నష్టాన్ని నివారిస్తారు. ఈ విషయమై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం...
కొరవడిన రక్షణ
జిల్లాలోని దండకారణ్యాలు కనమరుగైపోయి ప్రస్తుతం చిట్టడవులున్నాయి. వీటికి రక్షణ లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా చాలామంది అటవీ ప్రాంతం నుంచే పొలాల వద్దకు వెళ్తుంటారు. బీడీలు, సిగరెట్లు తాగేవారు వాటిని ఆర్పకుండానే పడేస్తుండటంతో అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. పశువుల కాపర్లు, బీడీ ఆకు కోసం వెళ్లేవారు, అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లేవారు, మేకలు, గొర్రెల పెంపకందారుల వల్ల కూడా మంటలు అంటుకుంటున్నాయి. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు, పోడు పట్టాలు పొందిన వారి భూములు అడవులకు సమీపంలో ఉండటంతోనూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో లక్షా 44వేేల ఎకరాల్లో అడవులు ఉన్నాయి. ఇటీవల నర్సాపూర్, శివ్వంపేట, కొల్చారం, వెల్దుర్తి, తూప్రాన్, రామాయంపేట తదితర ప్రాంతాల్లో అడవులు ప్రమాదాల బారినపడ్డాయి.
శాటిలైట్తో గుర్తించి...
జిల్లాలో ప్రమాదాల నివారణకు అటవీశాఖ కిలోమీటర్ల పొడవునా ఫైర్లైన్లను ఏర్పాటు చేసింది. అయిదు మీటర్లు అడ్డంగా ఫైర్లైన్ ఏర్పాటు చేయడంతో మంటలు వ్యాపించకుండా చేస్తారు. అటవీ ప్రాంతాన్ని హెక్టార్ల వారీగా విభజించి వీటిని నిర్మించడం వల్ల మంటలు వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా పొగ ఆధారంగా శాటిలైట్తో గుర్తించి అటవీ అధికారులకు షేర్ చేస్తారు. దాని ఆధారంగా సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పివేస్తున్నారు.
సిబ్బందికి ప్రత్యేక దుస్తులు
అడవుల్లో మంటలు ఆర్పే సమయంలో సిబ్బందికి పొగ, దుమ్ము కళ్లు, ముక్కులోకి వెళ్లి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో వారికి ప్రత్యేక దుస్తులు అందజేశారు. కొమ్మలను చేతిలో పట్టుకొని మంటల్ని ఆర్పడానికి చేతులకు గ్లౌజ్లు కూడా అందజేశారు. జిల్లాలో 20వరకు ఎయిర్ బ్లోయర్లు అందుబాటులో ఉంచారు.
కాపాడేందుకు చర్యలు
- రవిప్రసాద్, జిల్లా అటవీ అధికారి
వేసవిలో అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల వల్ల ఔషధ మొక్కలు నశించిపోతాయి. విలువైన వృక్ష సంపదకు నష్టం జరుగుతోంది. జీవరాశులు అంతరించి పోతాయి. ఎవరైనా నిప్పు పెట్టినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల