పావులు కదిపిన కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికల సమయంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ‘కారు’ దిగి ‘చేయి’ అందుకోవడంతో నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
మదన్రెడ్డి చేరికతో మారనున్న సమీకరణాలు
మెదక్, నర్సాపూర్, న్యూస్టుడే: పార్లమెంట్ ఎన్నికల సమయంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ‘కారు’ దిగి ‘చేయి’ అందుకోవడంతో నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో భారాస పార్టీ పట్టు సడలకుండా ప్రయత్నాలు చేస్తుండగా, మదన్రెడ్డి రాకతో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గత కొంతకాలం నుంచి మదన్రెడ్డి భారాసను వీడనున్నారనే ప్రచారానికి సోమవారం ఆయన చేరికతో తెరపడింది. అనుచరులతో భారీ ర్యాలీగా హైదరాబాద్లోని గాంధీభవన్ వెళ్లి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు. కౌడిపల్లికి చెందిన మదన్రెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అత్యధిక ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు భారాసకు చెందిన వారే. నర్సాపూర్ పురపాలికను సైతం భారాస గెలుచుకోవడంలో కృషి చేశారు. నియోజకవర్గ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ముద్ర వేసుకున్నారు.
సునీతారెడ్డి రాకతో
కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి భారాసలో చేరడంతో ఆయన తిరోగమనం ప్రారంభమైంది. అప్పటి వరకు ఏకతాటిపై ఉన్న భారాస రెండు వర్గాలుగా కొనసాగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మదన్రెడ్డికి కాకుండా సునీతారెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె పార్టీ క్యాడర్ను తనకు అనుకూలంగా మరల్చుకోవడం, పార్టీపై పట్టు సాధించారు. దీంతో పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోతుందని మదన్రెడ్డి భావించినా, మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటంతో పార్టీని వీడే ఆలోచన చేయలేదు. ఆతర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో సునీతారెడ్డి విజయానికి కృషి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టికెట్ దక్కకపోవడంతో ఇక భారాసలో కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని పార్టీని వీడే ఆలోచన చేశారు.
లాభనష్టం ఎవరికి
మదన్రెడ్డి చేరికతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంచనాల్లో ఇరు పార్టీలు మునిగిపోయాయి. మదన్రెడ్డి చేరడంతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు కలిసి వస్తుందా? అనే విషయంలో ఆసక్తికర చర్చలు కొనసాగిస్తున్నారు. రాజకీయాల పట్ల అవగాహన, అనుభవం ఉన్న నేత పార్టీలో చేరడం కాంగ్రెస్ విజయానికి అనుకూలిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ముందస్తు చర్యలు
జిల్లాలోని పలువురు నేతలు భారాసను వీడటంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ బలం పుంజుకోనుందని అంటున్నారు. మదన్రెడ్డి వెంట పార్టీ నేతలు వెళ్లకుండా మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డిలు ముందస్తుగా ముఖ్యనేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో ఫోన్లలో సంప్రదించారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. నర్సాపూర్లో ఆదివారం రాత్రి వీరు ముఖ్యనేతలతో సమావేశమై భారాసను వీడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ సభ విజయవంతానికి ఈ సమావేశం నిర్వహించామని చెప్పినా అందులో మదన్రెడ్డి చుట్టే చర్చలు జరిగాయి. మదన్రెడ్డి వెన్నంటి ఉండే ముఖ్యనేతల్ని పార్టీ వీడకుండా చేయడంలో కృతకృత్యులయ్యారు.
పార్టీ మారిన నేతలు
మెదక్ పురపాలిక ఛైర్మన్ చంద్రపాల్తో పాటు మరో తొమ్మిది కౌన్సిలర్లు, ఒక కో-ఆప్షన్ సభ్యులు భారాసను వీడారు. నర్సాపూర్ వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రాజుయాదవ్, ఏఎంసీ మాజీ వైస్ఛైర్మన్ హబీబ్ఖాన్, మాజీ ఎంపీపీ లలిత, చిప్పల్తుర్తి, నాగులపల్లి ఎంపీటీసీలు సంధ్యారాణి నాయక్, మేఘమాల, నేతలు కవితారెడ్డి, మల్లేశ్యాదవ్, రవిగౌడ్, నవీన్యాదవ్, కౌడిపల్లి మాజీ ఎంపీపీ పద్మ, నర్సింహరెడ్డి, మహ్మద్నగర్ ప్యాక్స్ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, ఉపాధ్యక్షుడు చిన్నంరెడ్డి, కౌడిపల్లి మాజీ సర్పంచి వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ మంజుల, మహ్మద్గనర్ ఎంపీటీసీ సునీత, తిమ్మాపూర్, రాయిలాపూర్, వెంకట్రావుపేట, రాజిపేట, తునికి గ్రామాల మాజీ సర్పంచ్లు ఉన్నారు. వెల్దుర్తి మాజీ జడ్పీటీసీ ఆముద ఆంజనేయులు, దామరంచ మాజీ సర్పంచి విజయభాస్కర్రెడ్డి చేరారు. శివ్వంపేట ప్యాక్స్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, నేతలు ఆనంద్, గంగాధర్, సోని, రవినాయక్, కొల్చారం మండలం నుంచి ఎంపీటీసీ అరుణ, కృష్ణాగౌడ్, అప్పాజిపల్లి, రంగంపేట, పోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్లు ఉన్నారు.
అవమానభారంతో భారాసను వీడాను
-మదన్రెడ్డి
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో సునీతారెడ్డికి టికెట్ ఇచ్చి తనను అవమానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఊరూరా ప్రచారం చేశారు. సిద్దిపేట నుంచి లక్ష మెజార్టీ ఇస్తానని మాజీ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. తీరా ఎన్నికల సమయానికి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషిచేస్తే డబ్బులు తీసుకుని పనిచేశారనే అపవాదును తనపై మోపారు. ఇలా భారాసలో అడుగడుగునా అవమానించడం, మోసగించడంతోనే ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా లాంటి సీనియర్ నేతను, నిస్వార్థపరుడిని వదులుకోవడం ఆ పార్టీకి నష్టమే. మాజీ సీఎం కేసీఆర్తో ఉన్న సంబంధాల వల్ల ఆ పార్టీని వదలడం బాధగానే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి