నిబంధనల అమలు..అడుగడుగునా తనిఖీలు
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నిఘాల ద్వారా అప్రమత్తంగా ఉంది.
కారులో పరిశీలిస్తున్న పోలీసులు
న్యూస్టుడే, సిద్దిపేట: ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నిఘాల ద్వారా అప్రమత్తంగా ఉంది. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల నగారా మోగగా మే 13న తెలంగాణలో పోలింగ్ తేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. ప్రణాళికాబద్ధంగా చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో పెద్దమొత్తంలో నగదు, మద్యం, ఇతర వస్తువులు లభించాయి. తనిఖీల సందర్భంలో ఇతరత్రా నేరాలు వెలుగుచూస్తుండటం గమనార్హం. గంజాయి సరఫరా, రేషన్ బియ్యం అక్రమ రవాణా ఉదంతాలు బయటపడుతున్నాయి. జిల్లాలో ఎనిమిది గంజాయి కేసులు నమోదవగా.. రూ.2.65 లక్షల విలువైన 8.209 కిలోల మేర సరుకు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకొని 21 కేసులు నమోదు చేశారు. రూ.8.80 లక్షల విలువైన బియ్యాన్ని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించారు.
జిల్లాలో 26 పోలీసు ఠాణాల పరిధిలో 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇవి రోజులో 24 గంటల పాటు వాహనదారులపై నిఘా సారిస్తున్నాయి. అనుమానితులను జల్లెడ పడుతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు - 11, స్టాటిస్టికల్ సర్వెలెన్సు - 13, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందాలు - 26 కీలక భూమిక పోషిస్తున్నాయి. 1,009 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులోని 151 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయాచోట్ల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తుంటే స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే సీఐఎస్ఎఫ్ కంపెనీకి చెందిన 80 మంది జిల్లాకు రాగా త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు జిల్లాకు చేరనున్నాయి.
ఫిర్యాదు చేయండి: అనూరాధ, పోలీసు కమిషనర్
ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం. అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పిస్తాం. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూం చరవాణి నంబరు 87126 67100లో సంప్రదించాలి. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి. పార్టీ ఏదైనా ప్రచారం అడ్డుకోవద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నం. 1950 లేదా సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి.
ఇప్పటివరకు నగదు స్వాధీనం - రూ.66.10 లక్షలు
మద్యం జప్తు - 1,209 లీటర్లు
మద్యం కేసులు - 113
విలువ - రూ.6.19 లక్షలు
పరిష్కరించిన నాన్బెయిలబుల్ వారెంట్లు - 121
బైండోవరు - 97
కేసుల్లో 101 మంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం